Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీస్ కుమార్, ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డిఎతో కలిసి ఉంటానని, ఎక్కడికి వెళ్లనని నితీస్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న ప్రధాని మోడీ చిరునవ్వు చిందించారు. బీహార్ ఔరంగాబాద్లో జరిగిన బహిరంగం సభలో నితీష్ ఇలా వ్యాఖ్యానించారు. ‘‘మీరు ఇంతకముందు బీహార్ వచ్చారు, కానీ నేను మీతో లేను, ఇప్పుడు నేను మీతో ఉన్నారు, నేను ఇక ఎక్కడి…
Bihar: ఓ వైపు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అధికార, విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీని గద్దె దించాలని భావిస్తున్న బీహార్లోని ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్ తగిలింది. ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల ‘మహాగటబంధన్’ కూటమికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పార్టీల ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధికార బీజేపీలో చేరారు.
Bihar Road Accident Today: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం తెల్లవారుజామున రామ్గఢ్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖిసరాయ్ సమీపంలోని ఝూల్నా గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న టెంపోను రాంగ్ సైడ్…
Illicit Relationship: చాలా వరకు వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ప్రియుడు లేదా ప్రియురాలు హత్యలకు గురైన సంఘటనలను మనం చాలానే చూశాం. తాజాగా మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బీహార్ సమస్తిపూర్కి చెందిన ఓ వ్యక్తి భార్యతో కాకుండా మరో యువతితో అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. ఇది తెలుసుకున్న భార్య, ప్రియురాలిని చంపాలని ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.
రాహుల్గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం వాయిదా పడింది. సోనియాగాంధీ (Soniya Gandhi) రాజ్యసభకు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా వాయిదా పడింది.
CM Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఇండియా కూటమి, ఆర్జేడీతో పొత్తుని తెంచుకుని ఇటీవల ఆయన మళ్లీ బీజేపీతో జతకట్టి ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. 9వ సారి ముఖ్యమంత్రిగా బీజేపీ-జేడీయూ ప్రభుత్వాన్ని బీహార్లో ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే, ఎన్డీయేలోకి తిరిగి చేరిన తర్వాత తొలిసారిగా ఆయన ఢిల్లీకి వచ్చారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.