Mallikarjun Kharge: ఏఐసీసీ చీఫ్ ఖర్గే హెలికాప్టర్ లో తనిఖీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Serious: ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారులు తమను లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ను ఎన్నికల అధికారులు తనిఖీ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎన్నికల అధికారులు తమ పార్టీ నేతలను టార్గెట్ చేశారని వ్యాఖ్యనించింది. అయితే, ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ నేతలు మాత్రం ఈజీగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడింది. బీహార్లోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాజేశ్ రాథోడ్ ఈ మేరకు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే శనివారం బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్, ముజఫర్పూర్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆయన ప్రయాణించిన హెలికాఫ్టర్లో ఎన్నికల అధికారులు, పోలీసులు చెక్ చేశారు.
Read Also: Mr Bachchan : మిస్టర్ బచ్చన్ యాక్షన్ సీక్వెన్స్ కోసం భారీ సెట్..
Also Read
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
అయితే, ఖర్గే హెలికాఫ్టర్ లో తనిఖీలకు సంబంధించిన వీడియోలను ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాజేశ్ రాథోడ్ పోస్ట్ చేశారు. అలాగే, ఈ వీడియోను బీహార్లోని ఎన్నికల సంఘం సీఈవోకు సైతం షేర్ చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నేతల హెలికాఫ్టర్లను మాత్రమే ఇలా తనిఖీలు చేస్తారా? లేకుంటే ఎన్డీయేలోని అగ్రనేతల హెలికాఫ్టర్లను కూడా ఇదే తరహాలో సోదాలు నిర్వహిస్తారా? అనేది వెల్లడించాలని బీహార్లోని ఎన్నికల ప్రధాన అధికారిని రాజేశ్ రాథోడ్ కోరారు. ఇలా అన్ని రాజకీయ పార్టీల నేతలను తనిఖీ చేసిన వీడియోలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుంటే ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుందనే అవకాశాలున్నాయని ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేరళలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ను సైతం అధికారులు తనిఖీలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!