Yogi Adityanath: ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామ ద్రోహులకు మధ్య జరుగుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గోహత్యను ప్రోత్సహించడం, ముస్లిం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మత ప్రాతిపదికన దేశ విభజన కోసం నిలబడన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాన్ని ‘‘రామద్రోహులు’’గా యోగి అభివర్ణించారు. బీహార్ బెగుసరాయ్ లోక్సభ స్థానంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ తరుపున ఎన్నికల ప్రచారాన్ని శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికలు రామ భక్తులకు, రామద్రోహులకు మధ్య జరుగుతున్నాయని అన్నారు.
Also Read
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
నేను రాముడి రాష్ట్రం నుంచి వచ్చాను, సీతా దేవి జన్మస్థలమైన బీహార్ ప్రజల హృదయాలతో అయోధ్య ఆలయానికి ప్రత్యేక స్థానం ఉందని తెలుసు అని యోగి అన్నారు. రామద్రోహులు రామ భక్తులపై తూటాలను పేల్చారు, మాఫియా డాన్ మరణానికి సంతాపం తెలిపారని పరోక్షంగా సమాజ్వాదీ పార్టీని దుయ్యబట్టారు. 1980వ దశకంలో ఎస్పీ వ్యవస్థాపకుడు దివంగత ములాయం సింగ్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ‘కరసేవకుల’పై పోలీసులు కాల్పులు జరపడం గురించి యోగి ప్రస్తావించారు. ఎన్డీయే అధికారం చేపట్టకముందే బీహార్లో ఆర్జేడీ-కాంగ్రెస్ అధర్మానికి కారణమని యోగి నిందించారు. ‘‘ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు ద్రోహం చేస్తూ ముస్లిం రిజర్వేషన్లను కల్పించడం ద్వారా దేశాన్ని మతప్రాతిపదికన విభజించడానికి వారు ప్రణాళికను రూపొందించారు’’ అని ఆరోపించారు. దళితులు, ఓబీసీలకు కేటాయించాల్సిన కోటాను ముస్లింలకు కేటాయిస్తు్న్నారంటూ కాంగ్రెస్ని నిందించారు.
గోహత్యలను ప్రోత్సహించే వారిని మనం వ్యతిరేకించాలని అన్నారు. ఎన్డీయేకు ఓటేసి ప్రధాని నరేంద్రమోడీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని ప్రజల్ని కోరారు. మోడీ హయాంలో సరిహద్దుల్లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోయిందని, భారత్ గడ్డపై క్రాకర్స్ పేలినా, పాకిస్తాన్ సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చిందని అన్నారు. భారతదేశం డిజిటల్ యుగంలోకి ప్రవేశిస్తే, ఆర్జేడీ, కాంగ్రెస్లు కలిసి మళ్లీ లాంతర్ యుగానికి తీసుకెళ్లాలని చూస్తున్నాయని ఆరోపించారు. యూపీలో 80 స్థానాలు గెలుచుకునేలా చూస్తున్నానని, బీహార్ కూడా ఎన్డీయేకి మెజారిటీ సీట్లు కట్టబెట్టాలని యోగి ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!