Bihar: కాంగ్రెస్ అభ్యర్థి, తన కొడుకుపై ఫోక్సో కేసు.. కుమారుడి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని ససారాం పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రామ్కు కష్టాలు చిక్కుల్లో పడ్డారు. మనోజ్, అతని కుమారుడు ఉజ్వల్ కుమార్తో సహా నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఓ మైనర్ బాలిక తండ్రి కైమూర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు 2024 ఏప్రిల్ 8న కుద్రా పోలీస్ స్టేషన్లో ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. మైనర్పై లైంగిక వేధింపుల ఆరోపణలపై కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రామ్ కుమారుడు ఉజ్వల్ కుమార్ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో మనోజ్రామ్ను కూడా నిందితులుగా చేర్చారు. కైమూర్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రామ్ ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు.
READ MORE: AP Elections 2024: చివరి రోజు ఏపీకి అగ్రనేతలు.. కడపకు రాహుల్.. తిరుపతికి నడ్డా..
Also Read
- Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
- SRH: బిగ్షాక్.. కాటేరమ్మ కొడుకుల కథ ముగింపు.. వచ్చే సీజన్కు ఆ ఏడుగురు ఆటగాళ్లు దూరం..
- Trinamool congress: బెంగాల్లో టీఎంసీ పతనానికి నాంది.. బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?
- Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం
మైనర్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో తన కూతురు మనోజ్ రామ్ కు చెందిన ఓ పాఠశాలలో చదువుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో మనోజ్, అతడి కుమారుడు బాలికను శారీరకంగా హింసించారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, మొబైల్ చాటింగ్, రికార్డింగ్, చిప్ లు ఉన్నాయని బాధితురాలి తండ్రి చెప్పారు. ఉజ్వల్ కుమార్, మనోజ్ కుమార్తో సహా మొత్తం నలుగురు వ్యక్తులు లైంగికంగా వేధించారని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనోజ్ రామ్, అతని కుమారుడు ఉజ్వల్ కుమార్ సహా నలుగురిని నిందితులుగా చేస్తూ కుద్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
తాజావార్తలు
-
Uttam Kumar Reddy : రైతులకు శుభవార్త.. అధికారులకు మంత్రి ఉత్తమ్ అల్టిమేటం..!
-
Ajit Doval: ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అలాంటి దేశాలను క్షమించకూడదన్న అజిత్ దోవల్
-
SRH: బిగ్షాక్.. కాటేరమ్మ కొడుకుల కథ ముగింపు.. వచ్చే సీజన్కు ఆ ఏడుగురు ఆటగాళ్లు దూరం..
-
Trinamool congress: బెంగాల్లో టీఎంసీ పతనానికి నాంది.. బీజేపీలోకి 20 మంది ఎంపీలు..?
-
Delhi Rain: ఢిల్లీలో భారీ వర్షం.. విమాన రాకపోకలకు అంతరాయం
ట్రెండింగ్
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!