Rahul Gandhi: సుశీల్ మోడీ రాహుల్ గాంధీపై పెట్టిన పరువు నష్టం కేసు పరిస్థితేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై సుశీల్ మోడీ ‘మోడీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సుశీల్ మోడీ మృతి చెందారు. ఇప్పుడు ఆ కేసు ఎటువైపు వెళ్తోందనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. కాగా, 2019 ఏప్రిల్ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది?’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దీనిపై సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఆ మరునాడు ఆయనపై అనర్హత వేటు వేశారు. తరువాత అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటును తొలగించింది.
READ MORE: Pushpa 2 : సినిమాలో అనసూయ పాత్ర మరింత వైల్డ్ గా ఉండబోతుందా..?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ఇదిలా ఉండగా.. బీహార్ బీజేపీ నాయకుడు, దివంగత నేత సుశీల్ కుమార్ మోడీ కూడా గతేడాది రాహుల్ గాంధీపై ‘మోడీ ఇంటిపేరు’ కేసు పెట్టారు. ఆయనపై ఈ పరువునష్టం కేసు నమోదైంది. ఏప్రిల్ 2023లో, రాహుల్ గాంధీపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి పాట్నా హైకోర్టు ఇక్కడ ట్రయల్ కోర్టు ముందు విచారణను నిలిపివేసింది. సుశీల్ మోడీ కేసులో పాట్నా హైకోర్టు ఈ ఏడాది మే 15 వరకు స్టే విధించింది. సుశీల్ మోడీ మృతితో రాహుల్ పై ఆయన కేసు ఏమవుతుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. సుశీల్ మోడీ వారసులు కేసును కొనసాగించాలంటే చట్టపరంగా అవకాశం ఉంటుందని పలువురు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. భారతదేశంలో ఫిర్యాదుదారు చనిపోతే పరువు నష్టం కేసు సాధారణంగా ముగియదు. ఫిర్యాదుదారు ప్రతినిధి, కుటుంబ సభ్యుల స్థానంలో చట్టపరమైన చర్యలు కొనసాగవచ్చు. ఫిర్యాదుదారుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎవరూ లేకుంటే.. కోర్టు కేసును కొట్టివేయవచ్చు.
- Tags
- against
- bihar
- defamation case
- Delhi
- ptna
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..