Rahul Gandhi: సుశీల్ మోడీ రాహుల్ గాంధీపై పెట్టిన పరువు నష్టం కేసు పరిస్థితేంటి?
రాహుల్ గాంధీపై సుశీల్ మోడీ ‘మోడీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల సుశీల్ మోడీ మృతి చెందారు. ఇప్పుడు ఆ కేసు ఎటువైపు వెళ్తోందనే ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది. కాగా, 2019 ఏప్రిల్ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటి పేరు ఎలా వచ్చింది?’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ దీనిపై సూరత్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. విచారణ జరిపిన సూరత్ కోర్టు ఈ ఏడాది మార్చి 23న రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఆ మరునాడు ఆయనపై అనర్హత వేటు వేశారు. తరువాత అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటును తొలగించింది.
READ MORE: Pushpa 2 : సినిమాలో అనసూయ పాత్ర మరింత వైల్డ్ గా ఉండబోతుందా..?
Also Read
ఇదిలా ఉండగా.. బీహార్ బీజేపీ నాయకుడు, దివంగత నేత సుశీల్ కుమార్ మోడీ కూడా గతేడాది రాహుల్ గాంధీపై ‘మోడీ ఇంటిపేరు’ కేసు పెట్టారు. ఆయనపై ఈ పరువునష్టం కేసు నమోదైంది. ఏప్రిల్ 2023లో, రాహుల్ గాంధీపై ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి పాట్నా హైకోర్టు ఇక్కడ ట్రయల్ కోర్టు ముందు విచారణను నిలిపివేసింది. సుశీల్ మోడీ కేసులో పాట్నా హైకోర్టు ఈ ఏడాది మే 15 వరకు స్టే విధించింది. సుశీల్ మోడీ మృతితో రాహుల్ పై ఆయన కేసు ఏమవుతుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. సుశీల్ మోడీ వారసులు కేసును కొనసాగించాలంటే చట్టపరంగా అవకాశం ఉంటుందని పలువురు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. భారతదేశంలో ఫిర్యాదుదారు చనిపోతే పరువు నష్టం కేసు సాధారణంగా ముగియదు. ఫిర్యాదుదారు ప్రతినిధి, కుటుంబ సభ్యుల స్థానంలో చట్టపరమైన చర్యలు కొనసాగవచ్చు. ఫిర్యాదుదారుకు ప్రాతినిధ్యం వహించడానికి ఎవరూ లేకుంటే.. కోర్టు కేసును కొట్టివేయవచ్చు.
- Tags
- against
- bihar
- defamation case
- Delhi
- ptna
తాజావార్తలు
-
Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
-
Easy Laundry Tricks: కాలర్ మొండి మరకలను సింపుల్గా వదిలించే సూపర్ టిప్స్!
-
IPL Playoff Chance: ప్లే ఆఫ్స్ చేరే జట్లపై క్లారిటీ.. ఆ రెండు జట్లు ఔట్..!
-
LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
-
Donald Trump: ‘‘మీకే ఎందుకు ఇలా జరుగుతోంది.?’’ కాల్పుల ఘటనపై ట్రంప్ ‘‘లింకన్’’ ఆన్సర్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!