బీహార్లో దారుణం జరిగింది. ముజఫర్పూర్ జిల్లాలో విద్యార్థుల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్లోని పుర్నియా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కొందరు వ్యక్తులు వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై బయలుదేరారు. సుమారు 20 మంది తెప్పపై వెళ్తున్నారు. హఠాత్తుగా అది అదుపుతప్పి పక్కకు ఒరిగిపోయింది.
Bihar Spurious Liquor News: మద్య నిషేధం అమల్లో ఉన్న బిహార్ రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం కలకలం సృష్టిస్తోంది. బిహార్లోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి 25 మంది ప్రాణాలు కోల్పోయారు. సివాన్ జిల్లాలోనే ఏకంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు సివాన్ ఎస్పీ అమితేష్ కుమార్ తెలిపారు. మరో 10-15 మందికి పాట్నాలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సారణ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు ప్రాణాలు…
Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి పాట్నాలోని తన అధికారిక బంగ్లా నుంచి ప్రభుత్వ ఆస్తుల్ని కాజేసినట్లు బీజేపీ ఆరోపించింది. రెండు రోజుల క్రితం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన తేజస్వీ యాదవ్.. ఎయిర్ కండీషనర్లు(ఏసీలు), బెడ్, నల్లాలు, వాష్ బెసిన్ వంటి వస్తువుల్ని తీసుకెళ్లినట్లు బీజేపీ అధికార ప్రతినిధి డానిష్ ఇక్బాల్ ఆరోపించారు. ‘‘5 దేశరత్న మార్గ్ నివాసం నుంచి మంచం, ఏసీ,…
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్, ఆయన తనయులు తేజస్వీయాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది. కొద్దిసేపటి క్రితం బెయిలు మంజూరు చేస్తూ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
Amit Shah: నేడు (సోమవారం) కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోవామపక్ష ప్రభావిత రాష్ట్రాలతో సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం కొనసాగనుంది. ఈ మీటింగ్ కు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యంత్రులు, హోంమంత్రులు, సీఎస్లు, డీజీపీలు హాజరుకాబోతున్నారు.
బీహార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మునిగిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
బీహార్ వరదల్లో బాధితులకు సాయం చేస్తున్న ఐఏఎఫ్ ఛాపర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ చాకచక్యంగా వరద నీటిలో ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రమాదం తప్పింది. స్థానికులు పడవ సాయంతో దగ్గరకు వెళ్లి రక్షించారు. ఇద్దరు అధికారులతో సహా నలుగురు ఐఏఎఫ్ సిబ్బందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు.
Bihar : బీహార్లోని దర్భంగాలోని షిషేన్లో నిర్మిస్తున్న బైపాస్ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ సమీపంలో ముగ్గురు మహిళలను రైలు ఢీకొట్టింది. ఈ ముగ్గురు మహిళలు గోపాల్పూర్లో రైలు ఢీకొని మరణించారు.