Bihar: ప్రేమ వ్యవహారంలో విద్యార్థుల ఘర్షణ.. ఒకరు హత్య
- బీహార్లో దారుణం
- విద్యార్థుల ఘర్షణ.. ఒకరు హత్య
- ప్రేమ వ్యవహారంగా పోలీసుల అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో దారుణం జరిగింది. ముజఫర్పూర్ జిల్లాలో విద్యార్థుల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో 11వ తరగతి విద్యార్థి చదువుతున్న విద్యార్థి.. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవలో గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అతడు మరణించాడు. బాధితుడు గాయపడి మరణించినట్లు పోలీసులు తెలిపారు.
ముజఫర్పూర్ పోలీసు సూపరింటెండెంట్ (రూరల్) విద్యా సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. సౌరభ్ కుమార్ కుర్హానీ బ్లాక్లో ఉన్న తుర్కీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి అని చెప్పారు.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
సౌరభ్ కుమార్, అతని స్నేహితులు ఓం ప్రకాష్ మరియు ప్రహ్లాద్ నేతృత్వంలోని మరొక బృందంతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సౌరభ్ తలపై వెదురు కర్రతో కొట్టాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఉదయం విద్యార్థి చనిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. ఘర్షణ జరిగిన వెంటనే ఇరువైపుల విద్యార్థుల కుటుంబ సభ్యులు నుంచి ఫిర్యాదులు తీసుకుని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. సౌరభ్ మరణం తర్వాత మాత్రం నిందితులపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే చనిపోయిన విద్యార్థి, నిందితులు మైనర్లేనని తెలుస్తోంది. ప్రేమ వ్యవహారం వల్లే గొడవ జరిగిందన్న పుకార్లతో సహా అన్ని కోణాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక విద్యార్థులు ఏఏ క్లాసులకు సంబంధించిన వాళ్లు అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..