Tragedy: నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృతి..
- బీహార్లో తీవ్ర విషాదం
- నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృతి
- సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మునిగిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. ప్రమాద ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన ఇద్దరు పిల్లల ఆచూకీ లభించకపోవడంతో SDRF బృందం రంగంలోకి దిగింది.
Read Also: Heart attack-Exercise: అలర్ట్.. అధిక వ్యాయామంతో గుండెపోటు..!
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
రోహ్తాస్ గ్రామం కేదార్ గౌర్కు చెందిన కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు సోన్ నదిలో స్నానానికి వెళ్లారు. వీరంతా.. ఎనిమిది నుండి పన్నెండేళ్ల మధ్య వయస్సు గలవారు. అయితే స్నానానికి నదిలోకి దిగిన వారు లోతు ఎక్కువగా ఉండటంతో ఓ చిన్నారి నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో మిగతా వారందరూ నీట మునిగి చనిపోయారు. వారు మునిగిపోతున్న సమయంలో రక్షించమని కోరారు. అయితే.. స్థానికులు అక్కడికి చేరుకునే లోపే నది ప్రవాహానికి కొట్టుకుపోయారు. అక్కడున్న బోటు డైవర్ల బృందం వారిని గుర్తించి ఐదుగురు పిల్లలను బయటకు తీశారు. కానీ, అప్పటికి చాలా ఆలస్యం అయింది. ఐదుగురు చనిపోయారు.
Read Also: Tata Share: సంచలనం సృష్టించిన టాటా షేర్.. లక్ష పెట్టుబడి పెడితే.. రూ. 7.5 కోట్లు అయ్యింది!
ఈ ప్రమాద ఘటనపై డెహ్రీ ఎస్డిఎం సూర్య ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. నీటి మట్టం ఎక్కువగా ఉండడంతో చిన్నారులు నీట మునిగి చనిపోయారని తెలిపారు. వారిలో ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారని.. ఇద్దరి కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు. మునిగిపోయిన ఏడుగురిలో ఇద్దరు బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.
- Tags
- Bath
- bihar
- died
- River
- Seven children
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!