Tragedy: నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృతి..
- బీహార్లో తీవ్ర విషాదం
- నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృతి
- సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మృతి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. సోన్ నదిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు మునిగిపోయారు. వారిలో ఐదుగురు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఇద్దరు పిల్లల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరోవైపు.. ప్రమాద ఘటనపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన ఇద్దరు పిల్లల ఆచూకీ లభించకపోవడంతో SDRF బృందం రంగంలోకి దిగింది.
Read Also: Heart attack-Exercise: అలర్ట్.. అధిక వ్యాయామంతో గుండెపోటు..!
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
రోహ్తాస్ గ్రామం కేదార్ గౌర్కు చెందిన కుటుంబానికి చెందిన ఏడుగురు పిల్లలు సోన్ నదిలో స్నానానికి వెళ్లారు. వీరంతా.. ఎనిమిది నుండి పన్నెండేళ్ల మధ్య వయస్సు గలవారు. అయితే స్నానానికి నదిలోకి దిగిన వారు లోతు ఎక్కువగా ఉండటంతో ఓ చిన్నారి నీటిలో మునిగిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో మిగతా వారందరూ నీట మునిగి చనిపోయారు. వారు మునిగిపోతున్న సమయంలో రక్షించమని కోరారు. అయితే.. స్థానికులు అక్కడికి చేరుకునే లోపే నది ప్రవాహానికి కొట్టుకుపోయారు. అక్కడున్న బోటు డైవర్ల బృందం వారిని గుర్తించి ఐదుగురు పిల్లలను బయటకు తీశారు. కానీ, అప్పటికి చాలా ఆలస్యం అయింది. ఐదుగురు చనిపోయారు.
Read Also: Tata Share: సంచలనం సృష్టించిన టాటా షేర్.. లక్ష పెట్టుబడి పెడితే.. రూ. 7.5 కోట్లు అయ్యింది!
ఈ ప్రమాద ఘటనపై డెహ్రీ ఎస్డిఎం సూర్య ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. నీటి మట్టం ఎక్కువగా ఉండడంతో చిన్నారులు నీట మునిగి చనిపోయారని తెలిపారు. వారిలో ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారని.. ఇద్దరి కోసం అన్వేషణ కొనసాగుతోందన్నారు. మునిగిపోయిన ఏడుగురిలో ఇద్దరు బాలికలు ఉన్నారని పేర్కొన్నారు.
- Tags
- Bath
- bihar
- died
- River
- Seven children
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!