New Railway Line: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం అనేక రైళ్లు తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Bhadrachalam Rains: ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా భద్రాచలం నీటమునిగింది. రామాలయం, అన్నదాన సత్రం పరిసరాల్లోకి వరద చేరింది. ఆలయ కొండపై ఉన్న కుసుమ హరినాథబాబా ఆలయ..
Bhadrachalam: గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల వల్ల దాని ప్రభావం భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయంపై పడింది. సీతారామచంద్రస్వామి దేవాలయానికి భక్తుల రాక భారీగా తగ్గింది.
MLA Tellam Venkatrao Do Delivery to two pregnant womens: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఇద్దరు గర్భిణులకు అత్యవసరంగా సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రిలో సర్జన్ లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది కంగారుపడిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే.. నేనున్నానంటూ రంగంలోకి దిగారు. ఇద్దరు గర్భిణులకు విజయవంతంగా సిజేరియన్ చేశారు. ప్రసూతి సేవలందించిన ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు.. తెల్లం వెంకట్రావు. ఎంఎస్ సర్జన్ అయిన తెల్లం గతంలో…
Bhadrachalam: అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి పర్యాట ప్రాంతంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 48 అడుగులకు చేరుకోవడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Coal Production: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్ బెల్ట్ జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లా ఇల్లందు, కోయగూడెం ఓపెన్కాస్ట్ గనుల్లోకి వర్షం నీరు చేరింది.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్న వరదలతో తెలంగాణ ఎగువన వున్న వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. దీంతో ఎగువ నుంచి కాళేశ్వరం, మేడిగడ్డ, తుపాకుల గూడెంతో పాటు ఛత్తీస్ఘడ్ నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను…