Godavari River: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి.. నీటిమట్టం 50 అడుగులు..
- భద్రాచలం వద్ద మరోసారి పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..
- గోదావరి నీటిమట్ట 51 అడుగులకు చేరుకుంది..
- నీటిమట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Godavari River: ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద మరోసారి గోదావరి నీటిమట్టం పెరుగు తుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్ట 51.10 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరొక రెండు అడుగులు నీటిమట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ఇప్పటికే భద్రాచలం నుంచి ఎగువ ప్రాంతాలకు దుమ్ముగూడెం మండలంలో పలుచోట్ల చర్ల, వాజేడు ,వెంకటాపురం, అదేవిధంగా భద్రాచలం నుంచి ఆంధ్ర ప్రాంత విన కూనవరం చింతూరు ప్రాంతాలకి రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గత వారం రోజుల నుంచి గోదావరీ పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. తాజాగా వారం రోజుల వ్యవధి లో గోదావరి మూడుసార్లు రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది. ఇది మరింత పెరిగి మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read also: Madanapalle Sub Collector Office Case: మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనలో కీలక పరిణామం..
Also Read
- Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
- Kothagudem Municipal Corporation : కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా..!
- Bomb Blast : జర్రుంటే రైలు పేలుతుండే..! బాంబు కొరికిన కుక్క.. బ్లాస్ట్..!
- CM Revanth Reddy : ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది బూర్గంపాడు మండలంలో పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. 53 అడుగులకు వస్తే మూడో ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీగా వరద అంతా శబరి మీద పడింది. శబరి నీటి ప్రవాహం వేగంగా పెరిగింది. తాజాగా.. శబరి 40 అడుగులకు చేరుకోవడంతో అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక ప్రారంభమైంది. దీంతో గోదావరి వరద కాస్త తగ్గింది. భద్రాచలం వద్ద గోదావరి కొద్ది మేరకు పెరుగుతున్నది. ఇది మరింత పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముందస్తు హెచ్చరికల్ని ఇప్పటికే అధికారులు జారీ చేశారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Liquor Shops Closed: 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో వైన్ షాపులు పూర్తిగా బంద్..
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?