Coal Production: ఓపేన్ కాస్ట్ లోకి చేరిన భారీగా వర్షపు నీరు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
- భూపాలపల్లి జిల్లా తాడిచర్ల ఓపేన్ కాస్ట్ లో నాల్గోవ రోజు నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
- కురుస్తున్న భారీ వర్షాలకు ఓపేన్ కాస్ట్ లోకి చేరిన భారీగా వర్షపు నీరు..
- ఓసీపీలో 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు ఆటంకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coal Production: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్ బెల్ట్ జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లా ఇల్లందు, కోయగూడెం ఓపెన్కాస్ట్ గనుల్లోకి వర్షం నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 35 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయాయి. కాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల బొగ్గు ఉత్పత్తి నాలుగో రోజు నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా ఓపెన్ కాస్టులోకి భారీగా వర్షం నీరు చేరింది. ఓసీపీలో 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. ఓబీలో 6 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నాలుగు రోజుల్లో 5.20 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు, 24 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
Read also: Janhvi Kapoor-Radhika Merchant: అందుకే రాధిక మర్చంట్కు పార్టీ ఇచ్చా.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Also Read
- Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
- CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
- CM Revanth Reddy : కాళేశ్వరం కేసీఆర్ అవినీతికి సాక్ష్యం.. రీ-డిజైన్ పేరుతో భారీ దోపిడీ..
- Bhupalapally: పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కట్టల కలకలం!
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామికవాడలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాలుగు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. రోజుకు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు ఓపెన్ కాస్ట్ గనుల్లో సేకరిస్తున్న నీటిని బటయకు పంపుతున్నారు. భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 19,686 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 18,227 క్యూసెక్కుల వరద బయటకు వెళుతోంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్కు 385 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1387 అడుగులుగా ఉంది.
Read also: Telangana: భారీగా వస్తోన్న వరద.. ప్రాజెక్టులకు జల కళ..
కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీకి 4.06 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో అధికారులు 85 గేట్లను ఎత్తి వరదను వదులుతున్నారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద జలకళను సంతరించుకుంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. దీంతో 10 మీటర్ల ఎత్తులో వరద ప్రవాహం ఉంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38 అడుగుల వద్ద కొనసాగుతోంది. సాయంత్రానికి 40 అడుగులకు చేరుకునే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Swarnalatha Bhavishyavani 2024: ఈసారి వర్షాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి.. భవిష్యవాణిలో..
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!