బెంగుళూరులో అద్దెకు ఇల్లు తీసుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.. ఏకంగా లక్షలు చెల్లించుకోవాలట..మొన్న ఏమో 90% మార్కులు ఉంటే ఇల్లు ఇస్తానని చెబుతున్నారు.. అలాగే ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తేనే ఇస్తామని అంటున్నారు.. బెంగళూరులో ఇంటి అద్దెలు ఇలాగే ఉన్నాయి. నో బ్రోకర్ యాప్ లో లిస్ట్ అయిన ఈ ఇంటి గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు… ఆ ఇల్లు కోసం ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.25 లక్షలు, నెలకు 2.5…
కరోనా సమయంలో విద్యార్థులకు ఎంతగానో సేవలందించిన భారత్లో అత్యంత విలువైన ఎడ్టెక్ కంపెనీ బైజూస్. మహమ్మారి విజృంభించిన సమయంలో డిమాండ్ అధికంగా ఉండగా.. ప్రస్తుతం ఆదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. దీంతో ఇటీవలి కాలంలో బైజూస్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది.
సోనియా గాంధీ ఫోటోను రాహుల్ గాంధీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ.. "అమ్మా, ఒత్తిడిలో కూడా దయకు సరైన ఉదాహరణ." అంటూ కామెంట్ రాసుకొచ్చారు.. ఈ ఫోటోలో సోనియా గాంధీ ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించారు.
రాబోయే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ను రూపొందించే ప్రయత్నంలో 26 పార్టీల నాయకులు రెండో రోజు సమావేశమయ్యారు. కాంగ్రెస్కు అధికారంపైనా, ప్రధాని పదవిపైనా ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశంలో అన్నారు.
ఒక షాకింగ్ సంఘటనలో, కర్ణాటకలోని బెంగళూరులోని ఐకియా స్టోర్లో వెలుగు చూసింది.. ఓ మహిళ తన షాపింగ్ పూర్తి చేసుకుంది.. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి అక్కడ ఉండే ఫుడ్ కోర్ట్లో ఆహారం తీసుకుంటుండగా సీలింగ్ నుండి టేబుల్పై చనిపోయిన ఎలుక పడిపోవడంతో ఆమెకు భయంకరమైన అనుభవం ఎదురైంది. ఈ సంఘటన జూలై 16 న జరిగింది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేశారు.. అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ ఘటన…
Sonia Gandhi: లోక్సభ ఎన్నికలకు ముందు బెంగళూరులో బీజేపీపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. కాంగ్రెస్ విపక్షాల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశానికి 26 పార్టీల నేతలు చేరుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బెనర్జీ కూడా సోమవారం బెంగళూరు చేరుకున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్ష నేతల తొలి రోజు సమావేశం ముగిసింది. వివిధ అంశాలపై దాదాపు రెండు గంటలకు పైగా నేతలందరూ చర్చించారు. రేపు (మంగళవారం) మరోసారి భేటీ కానున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పార్టీని నిలువరించే అంశాలతో పాటు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విపక్షాల సమావేశంలో 26 పార్టీలకు చెందిన 53 మంది నేతలు హాజరు అయ్యారు. రేపటి అజెండా 6 ముఖ్యమైన అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఉమ్మడి కనీస కార్యక్రమాలను రూపొందించేందుకు సబ్ కమిటీ ఏర్పాటుతో పాటు వచ్చే లోక్సభ ఎన్నికలకు ఇది విపక్షాల పొత్తుల వారధిగా నిలువనుంది. కూటమి పరిణామాల గురించి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేయడానికి పని చేస్తారు. కూటమి ఉమ్మడి కార్యక్రమాల ప్రణాళిక కోసం సబ్కమిటీ ఏర్పాటుపై చర్చిస్తున్నారు.