బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కాంగ్రెస్ నేత కె.రమేష్ బాబు ఫిర్యాదు మేరకు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో బీజేపీ నేతపై ఫిర్యాదు నమోదైంది.
Tomato Prices: దేశంలో టమాటా ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో టమాటా ధరలు లేవు. ఇప్పటికే కిలో టమాటా రేటు రూ. 100ను దాటింది. ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో సిటీలతో పాటు ప్రధాన నగరాల్లో టమాటా కిలో ధర సెంచరీని చేరింది.
House sales: హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ఈ ఏడాది నివాస గృహాల విక్రయాల్లో 8-10 శాతం వృద్ధి నమోదు అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, డిమాండ్ మెరుగ్గా ఉండటంతో దేశంలోని ఆరు నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు పెరుగుతాయని తెలిపింది. వసూల్లు బాగుండటంతో పాటు రుణభారం తక్కువగా ఉండటంతో డెవలపర్ల క్రిడెట్ ప్రొఫైల్ కూడా బలోపేతం అవుతాయని నివేదిక తెలిపింది.
Bengaluru: బెంగళూర్ లో అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో 25 మంది ఆఫ్రికా జాతీయులను అరెస్ట్ చేశారు.
Bengaluru: 8 ఏళ్ల వయసున్న బాలిక చెప్పిన అబద్ధం, తప్పుడు ఆరోపణ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ప్రాణాలు మీదికి తీసుకువచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్ తనను బలవంతంగా టెర్రస్ పైకి తీసుకెళ్లాడని చెప్పడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు, అపార్ట్మెమెంట్ లోని ప్రజలు చితకబాదారు. ఈ ఘటన బెంగళూర్ లోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. అయితే, బాలిక ఒంటరిగా టెర్రస్ పైకి వెళ్లినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బాలిక తల్లిదండ్రులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన…
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. వినూత్నంగా ఆలోచించి తన ఆటోని కారులా మార్చేశాడు. డబ్బులు ఖర్చు అయినా ఓకే కానీ.. అతని కలను నిజం చేసుకున్నాడు. అయితే ఆ ఆటో లోపల స్పెషల్ గా అచ్చం కారులా మెత్తటి సీట్లు, లైటింగ్, డోర్లు ఏర్పాటు చేయించాడు. బయటి నుంచి చూస్తే ఆటో మాదిరే ఉంటుంది. కానీ లోపల కూర్చుంటే కారులో ఎక్కిన ఫీలింగ్ కలుగుతుంది.
Mumbai Most Expensive Indian City For Expats: ప్రవాసులకు దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ, బెంగళూర్ నగరాలు వరసగా రెండూ మూడు స్థానాల్లో నిలిచాయి. మెర్సెర్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం, ఐదు ఖండాలలోని 227 నగరాల్లో సర్వే నిర్వహించారు. గ్లోబల్ ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే 147 స్థానంలో ముంబై నిలిచింది.
Toll Gate: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న టోల్ గేట్ ఆపరేటర్ గేటు తీయడం ఆలస్యమైందంటూ అతనిపై (26) కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో టోల్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరులో డేటా సైన్స్ ప్రోగ్రామ్ కంపెనీ సీఈవోను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యా రుణాలు ఇప్పిస్తామంటూ విద్యార్థులకు తప్పుడు వాగ్దానాలు చేసి ఆ సొమ్మును దుర్వినియోగం చేశారంటూ ఆ సంస్థ సీఈవోపై ఆరోపణలు ఉన్నాయి.
Delhi: దేశ రాజధాని ఢిల్లీ తడిసిముద్దవుతోంది. మంగళవారం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నగరంలో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుతలో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం ఏర్పడింది. ఢిల్లీకి రావాల్సిన అనేక విమానాలను దారి మళ్లించారు. మంగళవారం ఢిల్లీకి రావాల్సిన 10 విమానాల్లో 9 విమానాలను జైపూర్ కు, ఒకదాన్ని లక్నోకు దారి మళ్లించారు.