Bengaluru: జైలు నుంచి విడుదలైన కొన్ని గంటల్లోనే గ్యాంగ్స్టర్ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక రాజధాని బెంగళూరులో హత్య ఘటనలు పెరిగిపోతున్నాయి. గత నెల రోజుల్లో మరో గ్యాంగ్ స్టర్ హత్యకు గురికావడం కలకలం రేపుతుంది. జూలై 11న గ్యాంగస్టర్ కపిలాను ఇద్దరు వ్యక్తులు నరికి చంపారు. ఇప్పుడు తాజాగా మరో హత్య ఘటన చోటు చేసుకుంది. గ్యాంగ్స్టర్ మహేష్ ఎన్ అలియాస్ సిద్ధాపుర మహేష్ (33) నుశుక్రవారం సాయంత్రం హత్య చేశారు. బెంగళూరు సెంట్రల్ జైలు నుండి విడుదలైన కొద్దిసేపటికే హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది.
Pakistan: మీ పప్పులు మా దగ్గర ఉడకవు.. మా టీమ్లో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు..
Also Read
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
హత్యకు గురైన మహేష్ పలు నేరాలలో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా 2021లో జరిగిన బనశంకరి మెట్రో స్టేషన్లో పగటిపూట దొంగతనానికి పాల్పడ్డ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే మహేష్ హత్యలో మదన్ సహచరులు విల్సన్ గార్డెన్ నాగ, డబుల్ మీటర్ మోహన్ పాత్రలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జైలు నుంచి విడుదలైన తర్వాత మహేష్ను తీసుకెళ్లిన కారు డ్రైవర్ ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రెండు ఇన్నోవాలలో వచ్చిన ఓ ముఠా కారును దారి మళ్లించి.. ఆ తర్వాత మహేష్ ను వీధిలో నరికి చంపారు. జూలై 2021లో డజనుకు పైగా వ్యక్తులతో కూడిన ముఠా నాగాతో లింకులు కలిగి ఉన్నారని మదన్ ఆరోపించాడు. ఆ తర్వాత మదన్ ను హత్య చేశారు. ఈ కేసులో మహేశ్ను ప్రధాన సూత్రధారి, మరో 16 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు.
Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3!
మదన్ హత్యకు మహేశ్తో ఉన్న శత్రుత్వం మూలంగానే.., మహేశ్ సహచరుడు నవీన్కుమార్ను హత్య చేస్తానని మదన్ ఒకప్పుడు బెదిరించాడని జయనగర్ పోలీసులు తమ చార్జిషీట్లో పేర్కొన్నారు. మదన్ హత్య కేసులో అరెస్టయిన తర్వాత, ప్రత్యేక కేసు విచారణలో భాగంగా మహేష్ పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపగా.. అతని కాలికి గాయమైంది. అయితే మదన్ హత్య కేసులో మహేష్ ఏడాది పాటు జైలులో ఉండి.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యాడు. మరోవైపు మహేష్ పాత కేసులో తిరిగి జైలుకు వెళ్లాడు. అనంతరం ఇటీవలే విడుదలైన అతన్ని దుండగులు హత్య చేశారు. మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా దుండగుల ఆచూకీ వెతుకుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సికె బాబా తెలిపారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
-
Meta: మెటాకు భారీ షాక్.. అమెరికా కోర్టు సంచలన తీర్పు.. 567 మిలియన్ డాలర్స్ చెల్లించాలని ఆదేశం
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!