Manohar Lal Khattar - Pak, Bangladesh, India Can Unite: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ దేశంలో దాయాది దేశం పాకిస్తాన్, మరో పొరుగుదేశం బంగ్లాదేశ్ లు విలీనం అవుతాయిన వ్యాఖ్యానించారు. గురుగ్రామ్ లో మూడు రోజుల పాటు బీజేపీ జాతీయ మైనారిటీ మోర్చా శిక్షణా శిబిరంలో ప్రసంగించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీ మోర్చాలో ఆయన సోమవారం మాట్లాడారు.
బంగ్లాదేశ్ ప్రజల చిరకాల కల ఈ బ్రిడ్జ్. ఎన్నో అడ్డంకులు దాటుకుని తాజాగా శనివారం ప్రారంభం అయింది. దేశ ప్రధాని షేక్ హసీనా దేశంలోనే అత్యంత పొడవైన రోడ్డు, రైలు వంతెనను ప్రారంభించారు. పూర్తిగా దేశీయ నిధులతో ఎలాంటి విదేశీ సాయం లేకుండా ఈ వంతెన నిర్మించారు. రాజధాని ఢాకాతో నైరుతి బంగ్లాదేశ్ ను కలిపేందుకు ఈ బ్రిడ్జ్ ఎంతగానో సహాయపడుతుంది. పద్మ నదిపై 6.15 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లైన్ల రోడ్డు-రైలు వంతెనను నిర్మించారు. బంగ్లాదేశ్…
భారత్-బంగ్లాదేశ్ల మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య ఈ బస్సు సర్వీసులను నిలిపేసిన విషయం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్కతాకు వచ్చే బస్సు సర్వీసును పునరుద్ధరించారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ సర్వీసులను ఇవాళ మళ్లీ ప్రారంభించారు. అగర్తలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా, హరిదాస్పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మధ్య ఈ బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్లోని భారత…
కరోనా మహమ్మారి దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. గత రెండేళ్ల నుంచి గ్లోబల్ సప్లై చైన్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగాలపై ప్రభావం పడింది. ఇప్పటికీ శ్రీలంక వంటి దేశాలు కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతింది. కరోనా కారణంగా ఎక్కడిక్కడ దేశాలు ఆంక్షలు, లాక్ డౌన్లు విధించుకున్నాయి. దీంతో ఇతర దేశాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్లైట్స్, రైళ్లు రద్దు కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్ల క్రితం కోవిడ్…
డర్బన్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేశవ్ మహరాజ్ బౌలింగ్ ధాటికి 54 పరుగులకే ఆలౌటైంది. దీంతో తమ టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. గతంలో 2018లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో 43 పరుగులకే ఆలౌటై బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. డర్బన్ వేదికగా జరిగిన టెస్టుల్లో అత్యల్ప స్కోరు ఇదే కావడం గమనార్హం. కాగా…
పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియాకు ఇది నిజంగా చేదువార్తే. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్లో టీమిండియా వైట్ వాష్కు గురైన చోట బంగ్లాదేశ్ మాత్రం చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకుని దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ విజయం సాధించింది. బుధవారం రాత్రి సెంచూరియన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఒక్క మ్యాచ్…
మహిళల ప్రపంచకప్లో భారత మహిళలు సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 110 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించారు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత బౌలర్లు రాణించారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీతో రాణించిన యాసిక్త భాటియా(50)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. స్మృతి మంధాన (30), షెఫాలీ వర్మ (42)…
మహిళల ప్రపంచకప్లో టీమిండియా పరిస్థితి డోలాయమాన స్థితిలో ఉంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మంగళవారం నాటి బంగ్లాదేశ్తో మ్యాచ్లో తప్పక గెలవాలి. అంతేకాకుండా ఈనెల 27న జరిగే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్లోనూ విజయం సాధించాలి. అప్పుడే భారత్ ప్రపంచకప్లో సెమీస్ చేరేందుకు అవకాశం ఉంటుంది. టీమిండియా సమస్య ఏంటంటే.. బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ బౌలర్లు మాత్రం పూర్తి స్థాయిలో రాణించడం లేదు. కాబట్టి విజయాల బాట పట్టాలంటే బౌలర్లు తమ బంతులకు…
కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా రోజువారి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.. ఇక, కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటును బట్టి.. ఆయా దేశాలు విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేయడం, క్వారంటైన్ టైం తగ్గించడం లాంటి చర్యలు తీసుకుంటున్నాయి.. తాజాగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ (డీజీహెచ్ఎస్).. అక్కడి ప్రస్తుత ఇన్ఫెక్షన్ రేటును పరిగణలోకి తీసుకుని.. కొన్ని సడలింపులు ఇచ్చింది.. అందులోభాగంగా.. క్వారంటైన్ కాలాన్ని తగ్గించింది… బంగ్లాదేశ్లో…
అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ వరుస విజయాలతో అదరగొడుతోంది. శనివారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై ఘనవిజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. గత ప్రపంచకప్లో బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న భారత్ ఈ టోర్నీలో బదులు తీర్చుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి 37.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో మెహరూబ్ (30) టాప్స్కోరర్. భారత బౌలర్లలో రవికుమార్ మూడు, విక్కీ ఓస్తాల్ రెండు వికెట్లు…