Imran Khan: గతంలో బంగ్లాదేశ్లో జరిగిందే.. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What happened in East Pakistan is happening here now, says imran khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నంతో ఆ దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు అయిన ఇమ్రాన్ ఖాన్ పై గురువారం కాల్పులు జరిగాయి. పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్ లో తన మద్దతుదారులతో ర్యాలీ చేస్తున్న సందర్భంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ తో పాటు పలువురు పీటీఐ నాయకులు గాయపడ్దారు. ఒకరు మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు. అయితే కీలక నిందితుడు మాత్రం తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం నుంచి కోలుకున్న ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
Read Also: Vladimir Putin: భారతీయులపై రష్యా అధ్యక్షుడి ప్రశంసలు.. ఏమన్నారంటే..
Also Read
- Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ 'అణు' బాంబ్.. 'సర్మాట్' క్షిపణితో సర్ప్రైజ్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Iran Nuclear Warning: అమెరికాకు ఇరాన్ అల్టిమేటం.. 'మాపై చేయి వేస్తే.. అణు విలయమే!'
- Israel-Hezbollah: హిజ్బుల్లా అండర్గ్రౌండ్ను గుర్తించిన ఐడీఎఫ్.. వీడియో విడుదల
గతంలో ఈస్ట్ పాకిస్తాన్(బంగ్లాదేశ్)లో జరిగిందే.. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతోందని ఇమ్రాన్ అన్నారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు పేక్ ముజిబుర్ రెహ్మాన్, అతని పార్టీ అవామీ లీగ్ తో ఆయన్ను పోల్చుకున్నారు. గతంలో బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వంపై సైన్యం చర్యలు తీసుకుంది.. దీంతో తూర్పు పాకిస్తాన్ లో ఏం జరిగిందని ప్రశ్నించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కూడా ఇదే జరుగుతోందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆజాదీ మార్చ్ కు వెళ్తున్న క్రమంలో నాపై హత్యాయత్నం చేస్తారని ముందే తెలుసని ఇమ్రాన్ అన్నారు. ఈ హత్యాయత్నం కుట్రలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో పాటు, ఇంటీరియర్ మంత్రి రాణా సనావుల్లా, ఐఎస్ఐ చీఫ్ మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ హస్తం ఉందని పీటీఐ నాయకులు ఆరోపిస్తున్నారు.
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం అనంతరం 18 ఏళ్ల తరువాత బంగ్లాదేశ్ లో భారత్ తో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లానని.. రెండు మ్యాచుల సిరీస్ గెలిచాం. 1971 సమయంలో పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ పై విపరతీమైన ద్వేషం నెలకొందని.. అయితే ఎగ్జిబిషన్ మ్యాచులు గెలిచినప్పుడు, 50 వేల ప్రేక్షకులతో నిండిన స్టేడియం మొత్తం ‘ పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిందని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. వారికి మనం చేసిన అన్యాయం ఏమిటో అప్పుడు అర్థమైందని అన్నారు. బంగ్లాదేశీయులు మనల్ని వదిలేందుకు ఇస్టపడలేదు.. కానీ వారికి మనం న్యాయం చేయలేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Kagiso Rabada: వాళ్లు మొదలెట్టారు, మేము ముగించాం.. ఎస్ఆర్హెచ్ విక్టరీపై రబాడ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Raghunandan Rao: అధికారం పోయినా ఉదయనిధికి జ్ఞానోదయం కలగలేదు.. రఘునందన్ ఫైర్
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ ఇంకా బ్రతికే ఉన్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో!
-
GT Biggest Win: ఎస్ఆర్హెచ్పై గుజరాత్ చరిత్రాత్మక విజయం.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ విక్టరీ!
-
Avatar 3: ఫైనల్గా OTTలోకి ‘అవతార్ 3’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!