Imran Khan: గతంలో బంగ్లాదేశ్లో జరిగిందే.. ఇప్పుడు పాకిస్తాన్లో జరుగుతోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What happened in East Pakistan is happening here now, says imran khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై హత్యాయత్నంతో ఆ దేశంలో రాజకీయ దుమారం రేగుతోంది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు అయిన ఇమ్రాన్ ఖాన్ పై గురువారం కాల్పులు జరిగాయి. పంజాబ్ ప్రావిన్స్ వజీరాబాద్ లో తన మద్దతుదారులతో ర్యాలీ చేస్తున్న సందర్భంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ తో పాటు పలువురు పీటీఐ నాయకులు గాయపడ్దారు. ఒకరు మరణించారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నారు. అయితే కీలక నిందితుడు మాత్రం తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం నుంచి కోలుకున్న ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
Read Also: Vladimir Putin: భారతీయులపై రష్యా అధ్యక్షుడి ప్రశంసలు.. ఏమన్నారంటే..
Also Read
- Tragedy: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
- Bangladesh: బంగ్లాదేశ్కు చైనా యుద్ధ విమానాలు.. భారత్కు సవాలేనా.?
- Trump: భారత్, చైనా టారిఫ్లపై వాణిజ్య మంత్రితో ట్రంప్ వాగ్వాదం.. ఏం జరిగిందంటే..!
- Iran invites PM Modi: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకండి.. మోడీకి ఇరాన్ ఆహ్వానం..
గతంలో ఈస్ట్ పాకిస్తాన్(బంగ్లాదేశ్)లో జరిగిందే.. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతోందని ఇమ్రాన్ అన్నారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపక పితామహుడు పేక్ ముజిబుర్ రెహ్మాన్, అతని పార్టీ అవామీ లీగ్ తో ఆయన్ను పోల్చుకున్నారు. గతంలో బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వంపై సైన్యం చర్యలు తీసుకుంది.. దీంతో తూర్పు పాకిస్తాన్ లో ఏం జరిగిందని ప్రశ్నించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో కూడా ఇదే జరుగుతోందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆజాదీ మార్చ్ కు వెళ్తున్న క్రమంలో నాపై హత్యాయత్నం చేస్తారని ముందే తెలుసని ఇమ్రాన్ అన్నారు. ఈ హత్యాయత్నం కుట్రలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తో పాటు, ఇంటీరియర్ మంత్రి రాణా సనావుల్లా, ఐఎస్ఐ చీఫ్ మేజర్ జనరల్ ఫైసల్ నసీర్ హస్తం ఉందని పీటీఐ నాయకులు ఆరోపిస్తున్నారు.
1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్రం అనంతరం 18 ఏళ్ల తరువాత బంగ్లాదేశ్ లో భారత్ తో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు వెళ్లానని.. రెండు మ్యాచుల సిరీస్ గెలిచాం. 1971 సమయంలో పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ పై విపరతీమైన ద్వేషం నెలకొందని.. అయితే ఎగ్జిబిషన్ మ్యాచులు గెలిచినప్పుడు, 50 వేల ప్రేక్షకులతో నిండిన స్టేడియం మొత్తం ‘ పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిందని ఇమ్రాన్ ఖాన్ గుర్తు చేసుకున్నారు. వారికి మనం చేసిన అన్యాయం ఏమిటో అప్పుడు అర్థమైందని అన్నారు. బంగ్లాదేశీయులు మనల్ని వదిలేందుకు ఇస్టపడలేదు.. కానీ వారికి మనం న్యాయం చేయలేదని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Bellam Rava Laddu: నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే! 10 నిమిషాల్లో హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు’.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేయొచ్చు!
-
Ashirvad Sooryavanshi: 19 ఫోర్లు, 6 సిక్సర్లతో ఆశీర్వాద్ సూర్యవంశీ వీర విహారం.. మురిసిపోయిన వైభవ్..
-
ASTROLOGY: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. జూలై వరకు ఈ 4 రాశుల వారు జాగ్రత్త!
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Jairam Ramesh: ఆ ఆగ్రహంతోనే కాక్రోచ్ ఉద్యమం.. జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!