Tarique Rahman: రెండేళ్ల అనిశ్చితి తర్వాత బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఇటీవల జరిగిన బంగ్లా ఎన్నికల్లో ‘‘బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ)’’ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మన్ బంగ్లాదేశ్ ప్రధాని కాబోతున్నారు. ఫిబ్రవరి 17 సోమవారం రోజున తారిఖ్ రెహ్మాన్ తన మంత్రి వర్గంతో ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Tarique Rahman: ‘‘బంగ్లాదేశ్ ఫస్ట్’’ అనే నినాదంలో ఆ దేశ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, యూనస్ పరిపాలనతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, తారిఖ్ గెలుపు తర్వాత రెండు దేశాల సంబంధాలు మెరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా భారత సంబంధాల విషయంలో తారిఖ్ రెహ్మాన్ తొలిసారిగా స్పందించారు. బంగ్లాదేశ్ ఇంట్రెస్టుల ఆధారంగా భారత…
Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాకు ప్రధాని కాబోతున్నారు. మొత్తం 300 స్థానాల్లో 200కు పైగా స్థానాలు సాధించింది. అయితే, ప్రధాన పోటీదారుగా ఉన్న జమాతే ఇస్లామీ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది.
PM Modi: రెండేళ్ల అనిశ్చితి తర్వాత పొరుగుదేశం బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఘన విజయం సాధించింది. దివంగత మా ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ప్రధానిగా పదవీస్వీకారం చేయనున్నారు. ఇన్నాళ్లు బంగ్లాను పాలించిన తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ అధికారానికి తెరపడనుంది.
Bangladesh Elections 2026: బంగ్లాదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. బంగ్లాదేశ్ 13వ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త మార్పులకు తెరలేపాయి. అధికార సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో జాతీయవాద పార్టీగా గుర్తింపు పొందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) భారీ ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్లింది. ఆ పార్టీ 211 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ (Bangladesh Jamaat-e-Islami) 68 స్థానాల్లో గెలుపొందింది.…
Bangladesh Elections 2026: బంగ్లాదేశ్ 18 నెలల అస్థిరత తర్వాత, దేశ దశా దిశను మార్చే ఎన్నికలు ఈ రోజు(ఫిబ్రవరి 12)న జరిగాయి. పలు చోట్ల ఘర్షణలు జరిగినా, పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహం చూపారు. తాజాగా, ఓట్ల కౌంటింగ్ మొదలుకావడంతో ఫలితాలు వెలువడుతున్నాయి.
Bangladesh: మాజీ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీలో చేసిన ప్రసంగం బంగ్లాదేశ్లో ప్రకంపనలకు కారణమైంది. బంగ్లాదేశ్ శాంతి, భద్రత, ప్రజాస్వామ్య పరివర్తనకు ఆమె వ్యాఖ్యలు ముప్పు కలిగిస్తున్నాయని మహ్మద్ యూనస్ తాతాల్కిక ప్రభుత్వం ఆరోపించింది. హసీనాను ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించడానికి అనుమతించడం ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేసిందని బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం తెలిపింది. Read Also: India vs New Zealand 3rd T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. అప్పుడే రెండు వికెట్లు డౌన్!…
Sheikh Hasina: బంగ్లాదేశ్ను విడిచి వచ్చిన తర్వాత, మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్పై ఆమె విరుచుకుపడ్డారు. యూనస్ ఒక ఫాసిస్ట్ హంతకుడిగా పేర్కొన్నారు. ఆయన పాలనలో అక్రమ, హింసాత్మక పాలన కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు.
Bangladesh: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్మన్ తారిక్ రెహమాన్ తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఢాకాకు 200 కిమీ దూరంలో ఉన్న సిల్హెట్ లోని అలియా మాదర్సా మైదానంలో ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 12 ఎన్నికల కోసం బీఎన్పీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే, తాజాగా జమాతే ఇస్లామి అధినేత షఫీకుర్ రెహమాన్ను చైనా రాయబారి యావో వెన్ సోమవారం కలవడం చర్చనీయాంశంగా మారింది.