Bangladesh: మతోన్మాద జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ.. బంగ్లాలో ఏం జరుగుతోంది.?
- బంగ్లాదేశ్ ఎన్నికలకు ముందు కీలక పరిణామం..
- జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే, తాజాగా జమాతే ఇస్లామి అధినేత షఫీకుర్ రెహమాన్ను చైనా రాయబారి యావో వెన్ సోమవారం కలవడం చర్చనీయాంశంగా మారింది. యావో వెన్తో పాటు డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ లియు యుయిన్, పొలిటికల్ డైరెక్టర్ జాంగ్జింగ్తో పాటు చైనీస్ అధికారులు ఉన్నారు. ఇరు దేశాల ప్రతనిధులు చైనా, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అంశాల గురించి చర్చించారు.
చైనా, బంగ్లాదేశ్ మధ్య చారిత్రాత్మక స్నేహం ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి చాలా ముఖ్యమైందని జమాతే ఇస్లామీ పేర్కొంది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు ఈ సమావేశం జరగడం దీని ప్రాముఖ్యతను చాటుతోంది. గత సంవత్సరం విద్యార్థి తిరుగుబాటు సమయంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించిన యువజన పార్టీ ఎన్సిపితో పొత్తు పెట్టుకుని జమాతే ఇస్లామీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇటీవల జగన్నాథ్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది.
Also Read
- Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
- Qatar: ఖతార్ గ్యాస్ ప్లాంట్లో పేలుడు.. భారతీయుల సహా 13 మంది మృతి
- X Down: ‘ఎక్స్’కు అంతరాయం.. లక్షలాది మంది యూజర్లకు ఇక్కట్లు
- Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
Read Also: India-China: “షక్స్గామ్ వ్యాలీ మాదే, భారత్ది కాదు”.. చైనా ప్రకటన..
గతేడాది షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం చైనా ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లింది. ఇప్పుడు రెండోసారి జమాత్ నేతలతో చైనా అధికారులు భేటీ అయ్యారు. బంగ్లాదేశ్లోని చైనా రాయబారి యావో వెన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో గత దశాబ్ద కాలంలో బీఎన్పి, జమాతే ఇస్లామీతో చైనా సంబంధాలు కొనసాగించలేకపోయిందని, ఇప్పుడు వారితో తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
మతోన్మాద జమాతే ఇస్లామీకి, పాకిస్తాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఈ పార్టీ నేతలు పాకిస్తాన్తో సంబంధాలు పెంచుకోవాలని కోరుకున్నారు. భారత్ అంటే విషం వెళ్లగక్కే జమాతే ఇస్లామీ పార్టీ అధినేత ఇప్పుడు చైనా రాయబారితో భేటీ కావడం, భారత్కు ఆందోళన కలిగించే పరిణామాలు. షేక్ హసీనా సమయంలో భారత అనుకూల వైఖరి ఉండగా, ఇప్పుడు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకతను యూనస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ జమాత్ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ భారత వ్యతిరేక శక్తులైన పాక్, చైనాలకు ఆటస్థలంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Tilak Varma: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. 136 పరుగులు సాధించి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించిన వర్మ..
-
Qatar LNG Plant Explosion: 12 మంది భారతీయులు సహా 13 మంది మృతి.. అత్యవసర హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: బాల్కొండలో పొలిటికల్ ఫైట్.. ప్రశాంత్ రెడ్డికి చెక్ ఎవరు పెడతారు?
-
Off The Record: ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ స్టార్ట్?
-
T20 World Cup: ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. ‘వెళ్లి షాపింగ్, హోటల్లో డిన్నర్లు చేసుకోండి’..
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!