Bangladesh: మతోన్మాద జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ.. బంగ్లాలో ఏం జరుగుతోంది.?
- బంగ్లాదేశ్ ఎన్నికలకు ముందు కీలక పరిణామం..
- జమాత్ అధినేతతో చైనా రాయబారి భేటీ..
Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే, తాజాగా జమాతే ఇస్లామి అధినేత షఫీకుర్ రెహమాన్ను చైనా రాయబారి యావో వెన్ సోమవారం కలవడం చర్చనీయాంశంగా మారింది. యావో వెన్తో పాటు డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ లియు యుయిన్, పొలిటికల్ డైరెక్టర్ జాంగ్జింగ్తో పాటు చైనీస్ అధికారులు ఉన్నారు. ఇరు దేశాల ప్రతనిధులు చైనా, బంగ్లాదేశ్ మధ్య ఉన్న అంశాల గురించి చర్చించారు.
చైనా, బంగ్లాదేశ్ మధ్య చారిత్రాత్మక స్నేహం ఇరు దేశాల ప్రజల సంక్షేమానికి చాలా ముఖ్యమైందని జమాతే ఇస్లామీ పేర్కొంది. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు ఈ సమావేశం జరగడం దీని ప్రాముఖ్యతను చాటుతోంది. గత సంవత్సరం విద్యార్థి తిరుగుబాటు సమయంలో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించిన యువజన పార్టీ ఎన్సిపితో పొత్తు పెట్టుకుని జమాతే ఇస్లామీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇటీవల జగన్నాథ్ యూనివర్సిటీ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది.
Also Read
- Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
- Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం!
- Sudan Gurung: కొత్త ప్రభుత్వంలో అప్పుడే రాజీనామా! ఆరోపణలు వచ్చిన మూడు రోజుల్లోనే వైదొలిగిన హోం మంత్రి..
- Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
Read Also: India-China: “షక్స్గామ్ వ్యాలీ మాదే, భారత్ది కాదు”.. చైనా ప్రకటన..
గతేడాది షఫీకుర్ రెహమాన్ నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం చైనా ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లింది. ఇప్పుడు రెండోసారి జమాత్ నేతలతో చైనా అధికారులు భేటీ అయ్యారు. బంగ్లాదేశ్లోని చైనా రాయబారి యావో వెన్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో గత దశాబ్ద కాలంలో బీఎన్పి, జమాతే ఇస్లామీతో చైనా సంబంధాలు కొనసాగించలేకపోయిందని, ఇప్పుడు వారితో తిరిగి సంబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
మతోన్మాద జమాతే ఇస్లామీకి, పాకిస్తాన్కు మంచి సంబంధాలు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఈ పార్టీ నేతలు పాకిస్తాన్తో సంబంధాలు పెంచుకోవాలని కోరుకున్నారు. భారత్ అంటే విషం వెళ్లగక్కే జమాతే ఇస్లామీ పార్టీ అధినేత ఇప్పుడు చైనా రాయబారితో భేటీ కావడం, భారత్కు ఆందోళన కలిగించే పరిణామాలు. షేక్ హసీనా సమయంలో భారత అనుకూల వైఖరి ఉండగా, ఇప్పుడు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకతను యూనస్ ప్రభుత్వం పెంచి పోషిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ జమాత్ అధికారంలోకి వస్తే బంగ్లాదేశ్ భారత వ్యతిరేక శక్తులైన పాక్, చైనాలకు ఆటస్థలంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Viral Video: ధోని కాళ్లు పట్టుకున్న ముంబై ఇండియన్స్ ఆటగాడు..
-
LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Magic Rava Bites Recipe: రవ్వతో కొత్త స్నాక్.. 15 నిమిషాల్లో ‘మ్యాజిక్ రవ్వ బైట్స్’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ..!
-
Royal Enfield Himalayan 440: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త హిమాలయన్ 440 వచ్చేస్తోంది..
-
Mint Sharbat: కేవలం 2 నిమిషాల్లో తయారయ్యే సూపర్ హెల్తీ డ్రింక్.. సింపుల్గా మీ ఇంట్లో ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?