Bangladesh: భారత సంబంధాలపై తారిఖ్ రెహ్మన్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..
- భారత సంబంధాలపై తారిఖ్ రెహ్మాన్ కీలక వ్యాఖ్యలు..
- బంగ్లాదేశ్ ప్రయోజనాల ఆధారంగానే సంబంధాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tarique Rahman: ‘‘బంగ్లాదేశ్ ఫస్ట్’’ అనే నినాదంలో ఆ దేశ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, యూనస్ పరిపాలనతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, తారిఖ్ గెలుపు తర్వాత రెండు దేశాల సంబంధాలు మెరుగయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే, తాజాగా భారత సంబంధాల విషయంలో తారిఖ్ రెహ్మాన్ తొలిసారిగా స్పందించారు. బంగ్లాదేశ్ ఇంట్రెస్టుల ఆధారంగా భారత సంబంధాలు ఉంటాయని చెప్పారు. ‘‘బంగ్లాదేశ్, దాని ప్రజల ప్రయోజనాలు మన దేశ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయి’’ అని అన్నారు. భారత్, చైనా, పాక్ వంటి ప్రాంతీయ దేశాలతో సమతుల్య సంబంధాలు కొనసాగిస్తుందని, ఏ దేశాన్ని ‘‘మాస్టర్’’గా పరిగణించదని ఆయన గతంలో చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
Also Read
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయరు.. స్పష్టం చేసిన కేంద్రం..!
- Himachal Pradesh: ఘోర విషాదం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
- Central Cabinet Decisions: దక్షిణాదిలో కీలక రైలు మార్గానికి గ్రీన్సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలివే..!
- Abhijeet Dipke: సోనమ్ వాంగ్చుక్, కాంగ్రెస్పై అభిజిత్ దీప్కే సంచలన వ్యాఖ్యలు..
Read Also: Adurs 2: చారి ఈజ్ బ్యాక్.. ‘అదుర్స్ 2’ స్క్రిప్ట్ రెడీ.. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా?
300 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ 212 సీట్లను గెలుచుకుంది. రాడికల్ ఇస్లామిస్ట్ పార్టీ జమాతే ఇస్లామీ రెండో స్థానంలో నిలిచింది. జమాత్తో పోలిస్తే బీఎన్పీ ఒకింత భారత్ విషయంలో ఊరట ఇచ్చే అంశం. ఉదారవాద, ప్రజాస్వామ్య భావాలు ఉన్న బీఎన్పీ గెలుపుతో రెండు దేశాల సంబంధాలు మెరుగయ్యే అవకాశం ఉంది. నిజానికి షేక్ హసీనా పాలనను భారత్-బంగ్లా సంబంధాలకు ‘‘స్వర్ణయుగం’’గా భావిస్తారు. ఇప్పుడు బీఎన్పీ భారత్కు దగ్గర కావడం ప్రారంభించింది.
యూనస్ పరిపాలనలో మతోన్మాద జమాత్ నాయకులు భారత్కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అక్కడ హిందువులపై జరిగిన దాడుల్లో వీరి ప్రమేయం ఎక్కువగా ఉంది. ఇక యూనస్ భారత వ్యతిరేకతను రెచ్చగొట్టాడు. పాకిస్తాన్, చైనాతో అంటకాగుతూ భారత్ను ఇరుకునపెట్టాలని చూశాడు. తాజాగా, బీఎన్పీ గెలుపు తర్వాత ప్రధాని నరేంద్రమోడీ, తారిఖ్ రెహ్మాన్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని మోడీ ఫోన్ తర్వాత బీఎన్పీ పార్టీ థాంక్యూ చెబుతూ ట్వీట్ చేసింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Batting: ‘నా బౌలింగ్లో చితక్కొట్టాడు భయ్యా.. వైభవ్కు బౌలింగ్ వేయలేను’..
-
Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
-
Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
-
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!
-
Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!