Bangladesh Elections 2026: బంగ్లాదేశ్ ఎన్నికల్లో సంచలనం.. నలుగురు హిందూ అభ్యర్థులు ఘన విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Elections 2026: బంగ్లాదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. బంగ్లాదేశ్ 13వ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త మార్పులకు తెరలేపాయి. అధికార సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో జాతీయవాద పార్టీగా గుర్తింపు పొందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (Bangladesh Nationalist Party) భారీ ఆధిక్యంతో ముందుకు దూసుకెళ్లింది. ఆ పార్టీ 211 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ (Bangladesh Jamaat-e-Islami) 68 స్థానాల్లో గెలుపొందింది. ఈ తరుణంలో అక్కడున్న మైనారిటీల అంశం ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది. ఈ ఎన్నికల్లో హిందూ సమాజానికి చెందిన నలుగురు అభ్యర్థులు గెలవడం ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది. మొత్తం ఫలితాల్లో ఇది చిన్న సంఖ్యలా కనిపించినా, దాని వెనుక ఉన్న అర్థం మాత్రం పెద్దదే అంటున్నారు నిపుణులు.
READ MORE: Trump: ఇరాన్లో పాలన మార్పు తథ్యం.. డీల్ కుదరకపోతే జరిగేది అదేనన్న ట్రంప్
Also Read
- Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
- Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్పై ఫిర్యాదు.. రాహుల్గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
- Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్బై!
- Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి...
ఢాకా ప్రాంతంలో సీనియర్ నాయకుడు గయేశ్వర చంద్ర రాయ్ విజయం సాధించారు. ఆయన సుమారు 99 వేలకుపైగా ఓట్లు సాధించి తన ప్రత్యర్థిని వెనక్కి నెట్టారు. ఇటీవలి కాలంలో హిందూ సమాజంపై దాడులు, ఒత్తిళ్ల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన గెలుపు ప్రతీకాత్మకంగా ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో పోటీ కఠినంగా ఉన్నప్పటికీ ఆయన స్పష్టమైన ఆధిక్యంతో గెలవడం గమనార్హం. మగురా ప్రాంతంలో నితాయ్ రాయ్ చౌదరి (Nitai Roy Chowdhury) మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 1 లక్ష 47 వేలకుపైగా ఓట్లు లభించాయి. ఆయన గెలుపుతో ఆ ప్రాంతంలో పార్టీ బలం మరింత పెరిగిందని భావిస్తున్నారు. రంగమాటి నుంచి న్యాయవాది దీపెన్ దేవాన్ మూడో విజయం సాధించారు. తన ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యం సాధించి పార్లమెంట్లో చోటు దక్కించుకున్నారు. అలాగే బందర్బన్ ప్రాంతం నుంచి సాచింగ్ ప్రూ కూడా 1 లక్ష 41 వేలకుపైగా ఓట్లతో గెలిచారు. ఈ విధంగా ఈ పార్టీ తరఫున మొత్తం నలుగురు మైనారిటీ ప్రతినిధులు పార్లమెంట్లోకి వెళ్లారు.
READ MORE: Pulwama Attack: పుల్వామా దాడిపై ఆరేళ్ల తర్వాత పాకిస్థాన్ సంచలన ప్రకటనతో.. భారతీయుడి రక్తం మరిగింది!
https://www.yourwebsite.com/
తాజావార్తలు
-
Secret Reveal: 46 టన్నుల ఆర్బీఐ బంగారం గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఎలా వెళ్లింది..?
-
Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్పై ఫిర్యాదు.. రాహుల్గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
-
Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
-
Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్బై!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!