Sheikh Hasina: “బంగ్లాదేశ్ జైలు, ఉరిశిక్షలకు స్థలంగా మారింది”.. యూనస్పై విరుచుకుపడిన హసీనా..
- మహ్మద్ యూనస్ ఒక హంతక ఫాసిస్ట్.
- . బంగ్లాదేశ్ రక్తంతో తడిచిపోయింది..
- నన్ను కుట్రతో పదవి నుంచి తొలగించారు..
- తొలిసారి బహిరంగ సభలో షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బంగ్లాదేశ్ను విడిచి వచ్చిన తర్వాత, మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్పై ఆమె విరుచుకుపడ్డారు. యూనస్ ఒక ఫాసిస్ట్ హంతకుడిగా పేర్కొన్నారు. ఆయన పాలనలో అక్రమ, హింసాత్మక పాలన కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఫారిన్ కారస్పాండెంట్స్ క్లబ్లో జరిగిన ‘సేవ్ డెమోక్రసీ ఇన్ బంగ్లాదేశ్’ కార్యక్రమంలో హసీనా వీడియో సందేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి అవామీలీగ్కు చెందిన పలువురు మాజీ మంత్రులు, బంగ్లాదేశ్క వలసదారులు హాజరయ్యారు. బంగ్లాదేశ్లో ఫిబ్రవరి లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దేశ రాజకీయాలపై హసీనా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Jammu kashmir: పాక్ ఉగ్రవాది ఖతం.. భద్రతా బలగాలకు కీలక విజయం..
Also Read
- Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Cockroach Party: మరో దేశానికి పొంచి ఉన్న ‘కాక్రోచ్’ ముప్పు.. అవినీతిపై ఢిల్లీ తరహాలో కసరత్తు
- Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
- Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఈ రోజు బంగ్లాదేశ్ అగాధం అంచున ఉందని, తన తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ వారసత్వాన్ని ప్రస్తావిస్తూ.. దేశం పెద్ద జైలు, ఉరిశిక్షలకు స్థలంగా, మరణ లోయగా మారిందని ఆమె ఆరోపించారు. ఆగస్టు 5, 2024న తనను అధికారంలో నుంచి తొలగించడాన్ని పెద్ద కుట్రగా అభివర్ణించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ భయంకరమైన యుగంలోకి ప్రవేశించిందని, ప్రజాస్వామ్యం ఇప్పుడు ప్రవాసజీవితం గుడుపుతోందని ఆమె అన్నారు. యూనస్ హత్యకాండ ఫాసిస్ట్, వడ్డీ వ్యాపారీ, డబ్బు అక్రమ రవాణాదారు, అధికార దాహంతో దేశద్రోహం చేసిన వ్యక్తి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
యూనస్ పాలనలో మానవహక్కలు కారరాయబడ్డాయని, మీడియా స్వేచ్ఛను అణిచవేశారని, మహిళలు, మైనారిటీలపై దాడులు పెరిగాయని హసీనా అన్నారు. దేశవ్యాప్తంగా మూకదాడులు, దోపిడీలు, బెదిరింపులు జరుగుతున్నాయని అన్నారు. ఒకప్పుడు శాంతిగా ఉన్న దేశాన్ని ఇప్పుడు రక్తంతో తడిచిన నేలగా మారిందని ఆమె అన్నారు. తీవ్రవాద, మతతత్వ శక్తులు, విదేశాలు దేశాన్ని నాశనం చేశాయని ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!