Bangladesh: ‘‘ఢిల్లీ వద్దు, రావల్పిండి వద్దు’’.. బంగ్లాదేశ్ నేత నినాదం..
- ‘‘ఢిల్లీ వద్దు, పిండి వద్దు’’ నినాదం..
- బంగ్లాదేశ్లో బీఎన్పీ అధినేత వ్యాఖ్యలు..
- బంగ్లా ప్రయోజనాలే ముఖ్యమని ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్మన్ తారిక్ రెహమాన్ తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఢాకాకు 200 కిమీ దూరంలో ఉన్న సిల్హెట్ లోని అలియా మాదర్సా మైదానంలో ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 12 ఎన్నికల కోసం బీఎన్పీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల్లో ఫ్రంట్ రన్నర్గా తారిక్ రెహమాన్ ఉన్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన తారిఖ్, తన తల్లి మరణంతో బీఎన్పీ బాధ్యతలు తీసుకున్నారు. గత నెలలో ఖలీదా మరణించారు. యూకేలో 17 ఏళ్లు ప్రవాస జీవితం గడిపిన తారిఖ్ గత నెలలో బంగ్లాదేశ్ వచ్చారు.
Read Also: Karnataka: పిల్లలు లేరన్న కోపంతో భార్యను చంపిన భర్త.. హార్ట్ ఎటాక్గా చిత్రీకరించి చివరికీ..
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- Bangladesh: బెంగాల్లో బీజేపీ గెలుపుతో సంతోషంలో బంగ్లాదేశ్ ప్రధాని.. కారణం ఇదే..
- Project Freedom: అమెరికా, ఇరాన్ల మధ్య వివాదంలో కీలక మలుపు.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'కు ట్రంప్ బ్రేక్
బంగ్లాదేశ్ తిరిగి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో నిరుద్యోగం, రైతుల సమస్యల్ని ప్రస్తావించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ, పరోక్షంగా భారత్ను ప్రస్తావిస్తూ.. హసీనా ఇతర దేశాలకు లొంగిపోయారని అన్నారు. ‘‘ఢిల్లీ వద్దు, రావల్పింది వద్దు.. బంగ్లాదేశ్ ఫస్ట్’’ అనే నినాదాన్ని చేశారు. 1971లో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన జమాతే ఇస్లామీ పార్టీని కూడా విమర్శించారు.
బంగ్లాలో 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. బీఎన్పీతో పాటు జమాతే ఇస్లామీ కూడా ప్రధాన పార్టీగా పోటీలో ఉంది. జమాత్ అధినేత షఫీకుర్ రెహమాన్ నియోజకవర్గమైన ఢాకా-15 పరిధిలోకి వచ్చే మీర్పూర్లో నిర్వహిస్తున్నారు. జమాత్ నాయకుడు షఫీకుర్ రెహమాన్ మరియు 10 పార్టీల కూటమి నాయకులు ఈ ర్యాలీలో ప్రసంగిస్తారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ఓటేయడంతో పాటు సంస్కరణల పేరుతో జాతీయ చార్టర్పై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ చార్టర్పై గత ఏడాది దేశంలో 52 పార్టీల్లో 25 పార్టీలు సంతకాలు చేశాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ దీనిని వ్యతిరేకించింది. చార్టర్లో భాగంగా ప్రధానితో సమానంగా అధ్యక్షుడికి కూడా బాధ్యతలు ఇవ్వడం అఅనేది ఉంది.
తాజావార్తలు
-
Suvendu Adhikari PA: సువేందు అధికారి పీఏ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగులు
-
SRH: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకులు.. టాప్ లోకి దూసుకెళ్లిన హైదరాబాద్.. పలు రికార్టులు బద్దలు..
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!