Bangladesh: ‘‘ఢిల్లీ వద్దు, రావల్పిండి వద్దు’’.. బంగ్లాదేశ్ నేత నినాదం..
- ‘‘ఢిల్లీ వద్దు, పిండి వద్దు’’ నినాదం..
- బంగ్లాదేశ్లో బీఎన్పీ అధినేత వ్యాఖ్యలు..
- బంగ్లా ప్రయోజనాలే ముఖ్యమని ఎన్నికల ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్మన్ తారిక్ రెహమాన్ తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఢాకాకు 200 కిమీ దూరంలో ఉన్న సిల్హెట్ లోని అలియా మాదర్సా మైదానంలో ర్యాలీ నిర్వహించారు. ఫిబ్రవరి 12 ఎన్నికల కోసం బీఎన్పీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్నికల్లో ఫ్రంట్ రన్నర్గా తారిక్ రెహమాన్ ఉన్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడైన తారిఖ్, తన తల్లి మరణంతో బీఎన్పీ బాధ్యతలు తీసుకున్నారు. గత నెలలో ఖలీదా మరణించారు. యూకేలో 17 ఏళ్లు ప్రవాస జీవితం గడిపిన తారిఖ్ గత నెలలో బంగ్లాదేశ్ వచ్చారు.
Read Also: Karnataka: పిల్లలు లేరన్న కోపంతో భార్యను చంపిన భర్త.. హార్ట్ ఎటాక్గా చిత్రీకరించి చివరికీ..
Also Read
- US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
- Pakistan: ‘‘అసిమ్ మునీర్ కండోమ్లు పంచుతాడా.?’’ పాక్ ఆర్మీ చీఫ్ కొత్త బాధ్యతలపై సెటైర్లు..
- Iran War: ట్రంప్ వార్నింగ్తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
బంగ్లాదేశ్ తిరిగి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో నిరుద్యోగం, రైతుల సమస్యల్ని ప్రస్తావించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా విదేశాంగ విధానాన్ని విమర్శిస్తూ, పరోక్షంగా భారత్ను ప్రస్తావిస్తూ.. హసీనా ఇతర దేశాలకు లొంగిపోయారని అన్నారు. ‘‘ఢిల్లీ వద్దు, రావల్పింది వద్దు.. బంగ్లాదేశ్ ఫస్ట్’’ అనే నినాదాన్ని చేశారు. 1971లో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన జమాతే ఇస్లామీ పార్టీని కూడా విమర్శించారు.
బంగ్లాలో 2 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. బీఎన్పీతో పాటు జమాతే ఇస్లామీ కూడా ప్రధాన పార్టీగా పోటీలో ఉంది. జమాత్ అధినేత షఫీకుర్ రెహమాన్ నియోజకవర్గమైన ఢాకా-15 పరిధిలోకి వచ్చే మీర్పూర్లో నిర్వహిస్తున్నారు. జమాత్ నాయకుడు షఫీకుర్ రెహమాన్ మరియు 10 పార్టీల కూటమి నాయకులు ఈ ర్యాలీలో ప్రసంగిస్తారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం ఓటేయడంతో పాటు సంస్కరణల పేరుతో జాతీయ చార్టర్పై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. ఈ చార్టర్పై గత ఏడాది దేశంలో 52 పార్టీల్లో 25 పార్టీలు సంతకాలు చేశాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ దీనిని వ్యతిరేకించింది. చార్టర్లో భాగంగా ప్రధానితో సమానంగా అధ్యక్షుడికి కూడా బాధ్యతలు ఇవ్వడం అఅనేది ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “టాస్ వేసేదాకా చెప్పలేదు”.. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
-
Mohanlal: క్రిషాండ్తో మోహన్లాల్ కొత్త ప్రయోగం.. ‘చోటా ముంబై’ తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
-
Harry Brook: టీమిండియా బౌలింగ్ జుజుబి.. చాలా సరదాగా బ్యాటింగ్ చేశాం.. హ్యారీ బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Argentina vs Switzerland: అల్వారెజ్, మార్టినెజ్ల మాయాజాలం.. సెమీఫైనల్కు దూసుకెళ్లిన అర్జెంటీనా..
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!