Bangladesh: భారత సరిహద్దుల్లో “జమాత్” విజయం.. చికెన్స్ నెక్, ఈశాన్యానికి ప్రమాదం..
- భారత్-బంగ్లా సరిహద్దు జిల్లాల్లో జమాతే ఇస్లామీ గెలుపు..% ప్రమాదంగా మారిన పరిణామాలు..
- చికెన్స్ నెక్, ఈశాన్య రాష్ట్రాల భద్రతకు ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అఖండ విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు తారిఖ్ రెహ్మాన్ బంగ్లాకు ప్రధాని కాబోతున్నారు. మొత్తం 300 స్థానాల్లో 200కు పైగా స్థానాలు సాధించింది. అయితే, ప్రధాన పోటీదారుగా ఉన్న జమాతే ఇస్లామీ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. ఎన్నికల ముందు ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని అనుకున్నప్పటికీ, బీఎన్పీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది.
ఇదిలా ఉంటే, ఈ ఎన్నికల్లో జమాత్ గెలిచిన స్థానాలు భారత్కు ప్రమాదంగా మారాయి. ముఖ్యంగా భారత్తో సరిహద్దు పంచుకుంటున్న బంగ్లాదేశ్ జిల్లాల్లో జమాత్ ఘన విజయం సాధించింది. పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం, చికెన్స్ నెక్ కారిడార్ను ఆనుకుని ఉన్న బంగ్లా నియోజకవర్గాల్లో ఈ పార్టీ విజయం సాధించడం మనకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
Read Also: Sree Vishnu: శ్రీవిష్ణు Vs శ్రీవిష్ణు.. బాక్సాఫీస్ వద్ద నాతో నాకే పోటీ అంటున్న యువ హీరో!
జమాతే ఇస్లామీ మొత్తం 68 సీట్లు గెలిస్తే ఇందులో 51 భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పరిణామాలు భారత సరిహద్దుల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ను పెంచుతాయి. జమాత్ ఈ ప్రాంతాల్లో గత కొన్నేళ్లుగా రహస్యంగా పనిచేస్తోంది. ఉగ్రవాదులు, మతోన్మాదులకు జమాత్ ఆశ్రయం ఇస్తోంది. ఇదే కాకుండా దీనికి మనదేశంలో పనిచేస్తున్న కొన్ని ఇస్లామిస్టు గ్రూపులతో కూడా సంబంధాలు ఉన్నాయి. జమాత్ భారత్లోకి బంగ్లా చొరబాట్లను కూడా ప్రేరేపిస్తోంది. ఇప్పటికే చికెన్స్ నెక్(సిలిగురి కారిడార్) ప్రాంతంలో జనాభా స్వరూపం మారిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలోకి బంగ్లా చొరబాట్లు పెరిగాయి.
బంగ్లాలోని సత్ఖిరా, జెనైదా, జెస్సోర్, చపైనావాజ్గంజ్, కురిగ్రామ్, గైబంధ, కుష్టీయ, రాజ్షాహీ జిల్లాలు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఈ జిల్లాలను ఆనుకుని భారత్లోని ముర్షిదాబాద్, నార్ 24 పరగణాలు, సిలిగురి, కూబ్ బెహార్ జిల్లాఉ ఉన్నాయి. మరోవైపు చికెన్ నెక్ ప్రాంతంలోనిర రంగ్పూర్ జిల్లాలో కూడా జమాత్ చాలా స్థానాలు గెలిచింది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
-
ACB Raids : ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ దాడులు.. భారీ బంగారం, ఆస్తులు..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!