హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ కార్పోరేటర్లు, ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మరో కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే హజరయ్యారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లడుతూ.. బీజేపీ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పని చేయడం లేదని ఆయన అన్నారు. గౌరవ ముఖ్యమంత్రికి గౌరవంగా సమాధానం చెప్పుతామని ఆయన…
తెలంగాణ సీఎం కేసీఆర్పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి మండిపడ్డారు. శుక్రవారం నాడు జనగామలో కేసీఆర్ ఎందుకు బహిరంగ సభ పెట్టారో అర్ధం కావడం లేదన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేస్తున్నానని చెప్పడానికే కేసీఆర్ సభ పెట్టి ఉంటారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెడతామని కేంద్రం ఎప్పుడు చెప్పిందని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెల్లని రూపాయి అని.. ఢిల్లీలో ఆయన్ను ఎవరూ పట్టించుకోరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఢిల్లీ…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై నిరాధారమైన వ్యాఖ్యలు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్పై తెలంగాణ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరసనలపై బీజేపీ నేత స్పందిస్తూ ప్రత్యేక తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఆమోదించినప్పుడు చంద్రశేఖర్ రావు సభలో లేరని అన్నారు. బీజేపీ నాయకుడి వ్యాఖ్యలు అబద్ధమని వినోద్ కుమార్ అభివర్ణిస్తూ.. వాస్తవాలు తెలుసుకోకుండా సంజయ్ కుమార్ నిరాధారమైన…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శ్రమ ఫలించింది. తన పార్లమెంట్ పరిధిలోని రోడ్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ బండి సంజయ్ చేసిన విజ్ఝప్తి పట్ల కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కేంద్ర రహదారుల మౌలిక సదుపాయాల నిధి (సీఆర్ఐఎఫ్) కింద 2021-22 సంవత్సరానికిగాను తెలంగాణకు రూ. 878.55 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనా పరమైన అనుమతులు మంజూరు చేస్తూ ఆ శాఖ…
తెలంగాణ సీఎం కేసీఆర్ జోకర్లా వ్యవహరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అనర్ధాలను ప్రధాని మోదీ వివరించే ప్రయత్నం చేస్తే… టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఇబ్బందేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే టీఆర్ఎస్ ఎందుకు స్పందిస్తోందని నిలదీశారు. రాజ్యాంగంపై విమర్శలను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నిరసనలు చేపడుతోందని విమర్శించారు. రాజ్యాంగం విషయంలో కేసీఆర్ చేసిన వాఖ్యలపై బీజేపీ ఆందోళనలు…
317 జీవోను సవరించేదాకా ఉద్యోగ, ఉపాధ్యాయులంతా మరో మహోద్యమానికి సిద్దం కావాలని పిలుపునిస్తూ రూపొందించిన కరపత్రాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఇగ ఎట్లాంటి సమస్యలుండవ్… పిల్లలకు మంచిగ పాఠాలు చెప్పవచ్చని ఆశించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు నా హ్రుదయ పూర్వక నమస్సులు తెలిపారు. పరాయి పాలనలో ఏ స్థానికతకైతే భంగం వాటిల్లుతోందని పోరాడి తెలగాణ సాధించుకున్నమో అదే…
ఇటీవల సీఎం కేసీఆర్ రాజ్యాంగం చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొత్త రాజ్యాంగాన్ని ప్రతిపాదిస్తున్నారని బండి సంజయ్ కుమార్ ఆరోపించారు.…
సీఎం కేసీఆర్ పై మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవకాశావాదానికి పరాకాష్ట కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మాటలు వింటే నాకంటే ఎక్కువ రంగులు మార్చేటోడు కూడా ఉన్నడా? అని ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఆయన విమర్శించారు. అంతెందుకు… సరిగ్గా 6 ఏండ్ల కింద అంటే 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టినంక మొట్టమొదట మోసం చేసింది దళితులనేని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే దళితుడినే మొదటి ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినంక మాట తప్పిండని ఆయన అన్నారు. తానే సీఎం పదవి చేపట్టి దళితులను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, దళితుడికి సీఎం పదవి ఏమైందని జనం నిలదీస్తుంటే… చర్చను దారి మళ్లించేందుకు…