సీఎం కేసీఆర్ ఏమన్నాడని ప్రతిపక్షాలు బట్టలు చింపుకుంటున్నారు? బీజేపీ వాళ్ళు అయితే బట్టలు చింపుకొని మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. రైతు చట్టాల పై మోడీ క్షమాపణ చెప్పినప్పుడే ప్రధానిగా ఉండే అర్హత లేదని, మోడీ ఆరోజే రాజీనామా చేయాలి. సీఎం కేసీఆర్ రాష్ట్రాల హక్కులపై పోరాటం చేసే అవసరం ఎందుకు వచ్చిందని ఆయన అన్నారు. విభజన హామీలు ఎటు పోయాయి, ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు ఈ కేంద్ర ప్రభుత్వమని,…
హైదరాబాద్లో కాకుండా న్యూఢిల్లీలో ‘మిలియన్ మార్చ్’ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన టీఆర్ఎస్వీ, టీఆర్ఎస్ యువజన విభాగం ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. తమ హయాంలో ఎన్ని ఖాళీలున్నాయో వెల్లడించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశంలోని అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి టైమ్ ఫ్రేమ్…
సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన 2022 బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో మార్పులు రావాలని వ్యాఖ్యానించారు. దీనిని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నేడు ఢిల్లీలో మౌన దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా మాజీ మేయర్ రవీందర్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ డ్రామాలు మానేయ్ అంటూ ఆయన మాట్లాడారు. భీమ్ దీక్ష అని పెట్టి అందులో…
రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రేపు (గురువారం) తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టబోతున్నాయి. ఇందులో భాగంగా రేపు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాబూరావు, కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు…
కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తానని చెప్పిన రైతు ద్రోహివి అంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. దాన్యం ఎలా కొనుగోలు చేయవో చూస్తామని.. బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసిచ్చిందే నీవే అంటూ మండిపడ్డారు. ఫ్రీ యూరియా ఇస్తా అని హామీ ఇచ్చావు కదా.. ఇచ్చావా..? అని ప్రశ్నించారు. 317జీఓ మంచిదే అయితే 10 మంది ఎందుకు చనిపోయారని ఆగ్రహించారు. భార్య భర్తలను, తల్లి పిల్లలను విడగొట్టిన మూర్ఖుడని.. ని కొడుకు,…
బండి సంజయ్ నీ మిలియన్ మార్చ్ మోడీ దగ్గర చేయి మాదగ్గర కాదు అంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బండి సంజయ్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కేంద్రప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మాటల దాడికి దిగారు. కేంద్రంలో బీజేపీ తెలంగాణ పాలిట శ్రతువుగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణలో…
నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. నిజామాబాద్ జిల్లా నందిపేట ఎంపీటీసీ అరుణ చవాన్ పార్టీని వీడి ఆదివారం టీఆర్ఎస్లో చేరడంతో తెలంగాణ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ కె.కవిత, ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితర నేతల సమక్షంలో ఆమె టీఆర్ఎస్లో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తన నందిపేట పర్యటనలో రాజకీయ మైలేజీని పొందేందుకు రైతులను ఖలిస్తాన్తో పోల్చినందుకు అరుణ మరియు ఆమె మద్దతుదారులు తప్పు చేశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ 2019…
నిరుద్యోగులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని..అందరరం కలిసి కేసీఆర్ అంతు చూద్దామని బండి సంజయ్ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ తేల్చిందని బీజేపీ అధ్యక్షడు బండి సంజయ్ తెలిపారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్పై కేసులు నమోదు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. Read Also:…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ‘రెవెన్యూ చట్టాలు – ధరణిలో లోపాలపై జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం.. ధరణి పోర్టల్ పై తీవ్రంగా విమర్శించారు. ధరణి పోర్టల్ ప్రారంభమై రెండేళ్లైనా సమస్యలు మాత్రం తీరలేదు. సీఎం మాటలకు… చేతలకూ పొంతన లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది రైతులు, మాజీ సైనికాధికారులుసహా ప్రజలు దీనివల్ల అనేక కష్టాలు పడుతున్నా చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేటన్నారు.రాష్ట్రంలో ఉన్న మొత్తం…
రేపటి నుంచి బీజేపీ ‘మైక్రో డొనేషన్స్’ షురూ కానుంది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుండి ‘మైక్రో డొనేషన్స్’ పేరిట చిన్న మొత్తాలను విరాళాలుగా సేకరించాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘మైక్రో డొనేషన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. Read Also: ఆంధ్రప్రదేశ్లో జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నా:…