తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత నెలకొంది. యాసంగి ధాన్యం మేమే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని, బీజేపీ పోరాటం దీక్ష ఫలితంగా సీఎం దిగొచ్చి ధాన్యం కొంటామని చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ రైతుల, బీజేపీ కార్యకర్తల విజయమని ఆయన అన్నారు. కింద పొగ పెడితే తట్టుకోలేక కుర్చీ కోసం ధాన్యం కొంటామని ప్రకటించారని, వరి వేస్తే ఉరి…
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఇక, టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఈ తరుణంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి.. బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ కుక్కలు.. రైతులను వరి వేయాలని చెప్పారని గుర్తుచేసిన ఆయన.. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా బూట్లు నాకి.. బండి సంజయ్..…
తెలంగాణలో పండిన ప్రతి వడ్ల గింజనూ కేంద్రం కొనుగోలు చేయాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. ఇది విజయవంతం అయిందని ప్రకటించింది. ‘రైతుల పక్షాన ప్రజా ప్రతినిధుల నిరసన దీక్ష’ పేరుతో అక్కడి తెలంగాణ భవన్లో చేపట్టిన ఈ దీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 1,500 మంది ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ భారీ నిరసన దీక్షలో పాల్పంచుకున్నారు. ‘ఒకే…
కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు..గతంలో సైతం పలుమార్లు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమికి వర్గ విబేధాలే కారణం కాగా రాబోవు ఎన్నికల్లో కూడా ఈ గొడవ తప్పదేమో అని కింది స్థాయి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ఎంపీ గా రాష్ట్ర అధ్యక్షుడే ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో ఉన్నా అప్పుడప్పుడు అసమ్మతి రాగాలు వినబడుతూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ మూడు ముక్కలాట గా మారింది. కరీంనగర్ జిల్లా…
తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన ఉగాది వేడుకలు పెద్ద చర్చగా మారిపోయాయి.. సీఎం కేసీఆర్, మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాకపోవడంపై.. గవర్నర్ తమిళిసై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు కూడా డుమ్మా కొట్టారు.. దీనిపై పీసీసీ చీప్ రేవంత్రెడ్డి మండిపడ్డారు.. అసలు రాజ్ భవన్లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రంకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్కసుమన్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… కేంద్రం వరి రైతులకు ఉరి వేస్తోందని, కేంద్రం వరికి ఉరి వేస్తే వారికి ఘోరి కడుతామని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి నలుగురు ఎంపీలను గెలిపిస్తే రైతులను నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులకు రైతాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, వాళ్లకి…
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, అయినా సీఎం కేసీఆర్ దాని గురించి పట్టించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలన అంతానికి… ఇదే ఆఖరి పోరాటం. ప్రజలంతా బీజేపీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు బండి సంజయ్. ఢిల్లీలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు…
హైదరాబాద్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాడిసన్ పబ్ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేసే దమ్ము కేసీఆర్కు ఉందా అని ఆయన సవాల్ విసిరారు. ఈ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు ఉన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఆ పేర్లన్నీ తాను వెల్లడిస్తానని.. దమ్ముంటే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో ఎవరైనా బీజేపీ నేతలు ఉంటే వారిని…
తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల పంజాబ్లో మాదిరిగా తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్కు తెలంగాణ మంత్రులు వినతి పత్రం అందజేశారు. అయితే తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా కేంద్రంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కిషన్…