Bandi Sanjay: డ్రగ్స్ మాఫియా గురించి పట్టించుకోరా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, అయినా సీఎం కేసీఆర్ దాని గురించి పట్టించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలన అంతానికి… ఇదే ఆఖరి పోరాటం. ప్రజలంతా బీజేపీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు బండి సంజయ్.
ఢిల్లీలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు భిక్షమయ్య గౌడ్. ఈసందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలన కొనసాగుతోంది. అరాచక పాలనపట్ల ప్రజలు విసిగిపోయారు. బీజేపీ చేపడుతున్న పోరాటానికి ప్రజలంతా అండగా నిలిచారు. టీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించే ఇతర పార్టీల నేతలంతా కేసీఆర్ ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతోపాటు బీజేపీ గెలుపు కోసం తమవంతు క్రుషి చేయాలనే సంకల్పంతో పార్టీలోకి వస్తున్నారు.
Also Read
కొడుకు సీఎం సీటు కోసం డాడీ డాడీ అంటుంటే.. కేసీఆర్ ప్యాడీ ప్యాడీ అంటూ ప్రజల దృష్టి మళ్లించేందుకు ధాన్యం పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. విచ్చలవిడిగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. దీని గురించి సీఎం ఎందుకు స్పందించడం లేదు. డ్రగ్స్ విషయంలోనూ కఠిన చర్యలేవి? మొక్కుబడిగా సమావేశాలు పెట్టి హడావిడి చేయడం తప్ప సమస్యను పరిష్కరించిన దాఖలాల్లేవు. ప్రజల చర్చలను దారి మళ్లించేందుకే ధాన్యం పేరుతో నాటకాలాడుతున్నారు.
https://ntvtelugu.com/telangana-governor-tamilisai-soundararajan-to-visit-delhi-and-will-meet-amit-shah/
జంతర్ మంతర్ కాదు కదా టీఆర్ఎస్ నేతలు విదేశాల్లో ధర్నాలు చేసుకున్నా వచ్చే ఇబ్బందేమీ లేదు. అయినా మేం ధాన్యం కొనబోం అని చెబితే కదా.
కేంద్రం ఎంత రారైస్ ఇచ్చినా కొనేందుకైనా సిద్ధంగా ఉంది. పీయూష్ గోయల్ కూడా పార్లమెంట్ లో ప్రకటించారు. వరి పంట వేయాలని చెప్పేది వాళ్లే… సన్న వడ్లు వేయాలని చెప్పింది వాళ్లే. ఆ తరువాత మాట మార్చి వరి వేస్తే ఉరే గతి అన్నది వాళ్లే అన్నారు బండి సంజయ్.
ధాన్యం కేంద్రానికి పంపేది లేదని చెబుతోంది వాళ్లే. ధాన్యం కొనుగోలు కేంద్రాలు బంద్ చేస్తామని చెప్పింది వాళ్లే. ఇప్పుడు కేంద్రమే కొనాలంటూ గోల చేస్తోంది వాళ్లే. కరెంట్ బిల్లుల విషయంలో ప్రజలను దారి మళ్లించేందుకు కేసీఆర్ ఇలాంటి డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు బండి సంజయ్జ్.
తాజావార్తలు
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!