Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Fires On Cm Kcr Delhi Dharna

Bandi Sanjay:బరాబర్ కొనేది కేంద్రం.. సేకరించే దమ్ము కేసీఆర్‌కి వుందా?

Published Date :April 11, 2022 , 4:32 pm
By NTV WebDesk
Bandi Sanjay:బరాబర్ కొనేది కేంద్రం.. సేకరించే దమ్ము కేసీఆర్‌కి వుందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

వడ్ల కొనుగోలు వ్యవహారం మాటలయుద్ధానికి దారితీస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా, హైదరాబాద్‌ లో బీజేపీ దీక్షలతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. కేసీఆర్ చేతనైతే వడ్లు కొను…. లేదంటే గద్దె దిగు. ఢిల్లీలో కాదు… గల్లీలో తేల్చుకుందాం అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇందిరాపార్క్ వేదికగా జరిగిన బీజేపీ దీక్షలో బండి సంజయ్ సవాళ్ళు విసిరారు.

వడ్ల దందాతో కోట్లు దండుకునేందుకు కేసీఆర్ కుట్ర. బరాబర్ కొనేది కేంద్రమే… సేకరించి ఇచ్చే దమ్ము కేసీఆర్ కు ఉందా? వడ్లు కొనేదాకా కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పు కేసీఆర్ చేసి… కేంద్రాన్ని బదనాం చేస్తే ఊరుకునేది లేదన్నారు బండి సంజయ్. ఓట్లు, సీట్లు కొంటవ్… రైతుల కోసం వడ్లు కొనలేవా? దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలో ఇప్పుడే ఎందుకొచ్చింది? పంట చేతికొస్తున్న సమయంలో రైతులను అరిగోస పెడతావా? అన్నారు.

రైతులు చేసిన తప్పేంది?…. నువ్వు చేసిన తప్పులకు వాళ్లనెందుకు బలి చేస్తున్నవ్? మోదీని గద్దె దించే దమ్ముందా కేసీఆర్… రైతును రాజు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న గొప్ప నాయకుడు నరేంద్రమోదీ. ఒక్కో ఎకరానికి 65 వేలకుపైగా ఖర్చు చేస్తున్న ఘనత మోదీ సర్కార్ దే. మోదీ పాలనలోనే పత్తి, మిర్చిసహా పంట ఉత్పత్తులకు అధికంగా గిట్టుబాటు ధర లభిస్తోంది నిజం కాదా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ ను ఫాంహౌజ్ నుండి ఢిల్లీకి గుంజుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు సింహాలై గర్జిస్తున్నరు. వడ్ల కొనుగోలు పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో దీక్షల పేరిట డ్రామాలు చేస్తున్నారు. మోదీని గద్దె దించేంతటి మొనగాడివా? నీ పని ఎప్పుడో ఖతమైంది. తెలంగాణ ప్రజలు నిన్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో దీక్ష కోసం 5 రోజులు కష్టపడి ఫ్లెక్సీలు, కట్టి కష్టపడితే కండ్లు మూసుకుని తెరిచే సరికి కేసీఆర్ దీక్ష ముగించిండు. కేసీఆర్ కు కాయిల్ తప్పింది. కొడుకు సీఎం పదవి కోసం డాడీ డాడీ అంటుండు… తండ్రి ప్యాడీ ప్యాడీ అని తిరుగుతుండు.

బీజేపీని కుక్కలంటున్నరు. మొరుగుతున్నవి టీఆర్ఎస్ కుక్కలే. మోదీ సింహం లెక్క గర్జిస్తున్నరు. కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీల పెంచి ప్రజలపై భారం వేసిండు. ఛార్జీలను చూసి జనం భగ్గుమంటున్నరు. కాబట్టే చర్చను దారి మళ్లించేందుకే ఈ డ్రామాలు అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితిలో ఉన్నాడన్నారు. కోట్లు పెట్టి సీట్లు, ఓట్లు కొంటున్నడు. కానీ రైతుల వడ్లు ఎందుకు కొనడం లేదు? కమీషన్లకు అలవాటు పడి బ్రోకర్ల చేతిలో పెడుతున్నడు. బియ్యం కొనేది మేమే… పైసలు చెల్లించేది కేంద్రమే. ఇన్నాళ్లు నేనే కొంటున్నా, కేంద్రానికి సంబంధం లేదని 7 ఏళ్లుగా ప్రజలను వంచించినవ్ కదా… మరెందుకు కొనడం లేదో చెప్పాలి?

నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి బీజేపీ వాస్తవాలు చెబితే రైతులు నమ్ముతున్నరని భయపడి ఉద్దేశంతో కేంద్రాన్ని బద్నాం చేసేందుకు రైతులను అరిగొస పెడుతున్నడు. మళ్లీ చెబుతున్నం… పక్కా కొనేది కేంద్రమే. నువ్వు సేకరించి ఇస్తవా లేదా? నువ్వు బ్రోకర్ వి మాత్రమే. రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రోకర్ గా మారి కమీషన్లు తీసుకుని వడ్లు సేకరించి కేంద్రానికి ఇవ్వాలి. డబ్బులు ఇచ్చేది కేంద్రమే. అన్ని రాష్ట్రాలతో కేంద్రం జూమ్ సమావేశం ఏర్పాటు చేస్తే అన్ని రాష్ట్రాలు యాసంగి పంట ధాన్యం వివరాలు వెల్లడిస్తే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆ వివరాలు ఇవ్వలేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. ధాన్యం ఇవ్వబోమని, కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తున్నామని రైతులను మోసం చేస్తున్న మూర్ఖుడు కేసీఆర్.

https://ntvtelugu.com/muralidharan-on-kcr-corruption-politics/

కేసీఆర్… రైతులు పండించిన పంటను ఎట్టి పరిస్థితుల్లో కొని తీరాల్సిందే. కొనివ్వకుంటే నిన్ను ఉరికిస్తం. నువ్వు కోనేదాకా వదిలిపెట్టం. ధర్నాలు, దీక్షలన్నీ ఆడోళ్ల చీరలు గుంజడానికి, మైకులు లాక్కోవడానికి తప్ప నువ్వు సాధించేదేమీ లేదని సోషల్ మీడియా ద్వారా తెలిసిపోయింది. టీఆర్ఎస్ నేతలు సంస్కారహీనులు అంటూ మండిపడ్డారు బండి సంజయ్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • cm kcr
  • kcr dharna
  • one nation one procurement
  • paddy issue

తాజావార్తలు

  • Ranbir Kapoor :‘టైమ్ 100’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు!

  • PM Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం

  • Rajat Patidar: కోహ్లీ వల్ల కాదు.. ఆ ‘స్టన్నింగ్ క్యాచ్’ వల్లే మ్యాచ్‌ గెలిచాం.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

  • 8th Pay Commission: భారీ డిమాండ్.. కనీస వేతనం రూ.69 వేలు..!

  • Nicholas Pooran: దాచడానికి ఏముంది, మేం చెత్తగా ఆడాం.. లక్నో కెప్టెన్ పూరన్!

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions