Karimnagar Bjp: అసమ్మతిరాగాలతో బండికి తలనొప్పి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీలో వర్గ విభేదాలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు..గతంలో సైతం పలుమార్లు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమికి వర్గ విబేధాలే కారణం కాగా రాబోవు ఎన్నికల్లో కూడా ఈ గొడవ తప్పదేమో అని కింది స్థాయి కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా ఎంపీ గా రాష్ట్ర అధ్యక్షుడే ప్రాతినిధ్యం వహిస్తూ జిల్లాలో ఉన్నా అప్పుడప్పుడు అసమ్మతి రాగాలు వినబడుతూనే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ మూడు ముక్కలాట గా మారింది.
కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీ కి బలమైన ఓటు బ్యాంకు ఉన్న జిల్లా ఇక్కడ బీజేపీ నాయకులు జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పగలరు. అంతటి ప్రాముఖ్యత జిల్లాలో వర్గాల గోల తప్పట్లేదు. గత కొంత కాలంగా జిల్లా బీజేపీలో సీనియర్లు వర్సెస్ బండి సంజయ్ గా నడిచిన పోరు కాస్తా సద్దుమణిగి సయోధ్య కుదిరినా అంతర్గత పోరు మాత్రం అలానే కంటిన్యూ అవుతుందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆశావహులు ఎక్కువ ఉండటంతో బీజేపీలో మరోసారి గొడవలు తప్పవనేలా పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి..జిల్లాలో ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్న పార్టీలో ఆధిపత్య పోరులో సామాన్య కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ శ్రేణుల్లో వినబడుతోంది.
Also Read
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ఉమ్మడి జిల్లాలో మూడు వర్గాలుగా బిజెపి పార్టీ కార్యక్రమాలు నడుస్తోంది. బండి సంజయ్,ఈటెల రాజేందర్,మాజీ ఎంపీ వివేక్,సీనియర్ నేతల వర్గాలతో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతుంది. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గంలో బీజేపీ పార్టీ మూడు గ్రూప్ లుగా మారింది. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత గుజ్జుల రామకృష్ణా రెడ్డి,బండి సంజయ్ అనుచరుడు ప్రదీప్,మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి వర్గాలుగా విడిపోయాయి. ఏకార్యక్రమం చేపట్టినా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కార్యక్రమాలు జరుపుకోవడం చర్చకు దారి తీస్తోంది. బండి సంజయ్ సన్నిహితుడిగా ఉన్న ప్రదీప్ కు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణా రెడ్డి మధ్య టికెట్ పోరు ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఇదే జిల్లాలోని మరో నియోజకవర్గం రామగుండం. ఇక్కడి బీజేపీలో సైతం మూడు గ్రూపులు ఉన్నాయి..మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వర్సెస్ మాజీ ఎంపీ వివేక్ వర్గం, బండి సంజయ్ వర్గాలుగా ఉన్నారు..సోమారపు సత్యనారాయణ కు వివేక్ వర్గం నుండి ఇబ్బందులు తలెత్తడంతో ఆయన జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు మంథని బీజేపీలో పాత కొత్త నాయకులకు సమన్వయం లోపం నెలకొందని పార్టీ శ్రేణుల్లో వినబడుతుంది. సీనియర్ నాయకుడు సనత్ కుమార్ కు కొత్తగా బీజేపీ లో చేరిన సునీల్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు అంతర్గత విభేదాలు పార్టీ కార్యకర్తలకు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి.
సనత్ కుమార్ బండి సంజయ్ వర్గం కాగా సునీల్ రెడ్డి వివేక్ వర్గంగా ఉన్నారు..రాబోయే ఎన్నికల్లో టికెట్ కోసం ఇద్దరు నాయకులు పోటీ పడుతున్నారని ప్రచారం సాగుతోంది..దీంతో సామాన్య కార్యకర్తలకు ఇక్కట్లు తప్పట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో బీజేపీ పార్టీలో ముసలం పుట్టింది..ఎవరికి వారే ప్రచారాలు చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో తమదే టికెట్ అని పార్టీ శ్రేణులకి చెబుతున్నారు. వేములవాడ లో బండి సంజయ్ వర్గం గా ఉన్న ప్రతాప రామకృష్ణ, ఈటల రాజేందర్ వర్గంగా ఉన్న తుల ఉమ,మహా రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కొడుకు వికాస్ లు ఎవరికి వారుగా కార్యక్రమాలు సేపరేట్ గా చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
స్థానికంగా వున్న ఎమ్మెల్యే పై వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో ఈసారి బీజేపీ లో టికెట్ వస్తే చాలు అన్నట్లు ఎవరి ఎత్తులు వారు వేస్తున్నారు..సామాజిక కార్యక్రమాలతో ప్రజల్లో వెళ్తున్నా గ్రూప్ లు మధ్య అంతర్గతంగా పోరు తప్పట్లేదని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ ఈ తలనొప్పుల నుంచి ఎలా బయటపడతారో చూడాలి.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!