తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సవాళ్ల పర్వం మొదలైంది… ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో మంత్రి కేటీఆర్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కి సవాల్ విసిరారు.. నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధమా? అని బహిరంగ సవాల్ విసిరారు.. అయితే, కేటీఆర్ సవాల్కు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.. యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం 9 శాతం నిధులు అధికంగా రాష్ట్రానికి ఇచ్చిందన్న ఆయన.. కేటీఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు అని…
చరిత్రను కనుమరుగు చేస్తున్నారంటూ మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తన పాదయాత్రలో భాగంగా రాందాస్ చౌరస్తాలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యమంలో సెప్టెంబర్ 17ను నిర్వహించాలని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు చేయడం లేదు? అని ప్రశ్నించిన ఆయన.. నిజాం కుటుంబానికి భయపడి కేసీఆర్ విమోచన దినోత్సవం జరపడం లేదని ఆరోపించారు.. ఇక, ఈ నెల 17వ తేదీన నిర్మల్లో జరగనున్న కేంద్ర హోంశాఖ…
తెలంగాణలో కేసీఆర్ పాలనను అంతమొందించి పేదల పార్టీ బీజేపీ పాలన రావాలని ఆకాంక్షించారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లిలో నిర్వహించిన బహిరంగసభకు హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్కి.. తెలంగాణకు దగ్గరి పోలికలు ఉన్నాయన్నారు.. ఇక, కేసీఆర్.. ఒవైసీ సోదరుల మొప్పు పొందడానికి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.. ఒకే దేశంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండకూడదని ఆర్టికల్…
రాజకీయాల్లో ఎమర్జ్ అయ్యే నేతలు కొందరు.. ప్రజలపై స్పష్టమైన ప్రభావాన్ని కలిగిస్తూ ఉంటారు. భవిష్యత్ పై క్లియర్ అజెండాతో ముందుకు వెళ్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో.. 3 ప్రధాన పార్టీల్లో.. ముగ్గురు యువనేతలు ఇలాగే రాజకీయాలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నారు. రాబోయే తరానికి కాబోయే రాజకీయ సారథులం మేమే అన్నట్టుగా వారు తమ తమ పార్టీల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అందులో టీఆర్ఎస్ ను గమనిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడిగా.. మంత్రిగా గుర్తింపు తెచ్చుకుని.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి…
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బండి సంజయ్ వాడిన సర్జికల్ స్ట్రైక్స్ అన్న పదం.. ఎంతటి ప్రభావాన్ని కలిగించిందో మనం ప్రత్యక్షంగా చూశాం. బీజేపీ అనూహ్య ఫలితాలను సొంతం చేసుకుని.. జీహెచ్ఎంసీలో బలం పుంజుకున్న తీరును సైతం గమనించాం. ఇదే ఒరవడిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముందుకు తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇందుకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్ లో మాదిరిగా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. వెంటనే…
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు.. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన నిర్మల్కు వచ్చేయనున్నారు.. తెలంగాణ విమోచన సభను నిర్మల్ లో నిర్వహించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అయితే, 17వ తేదీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడనుంది.. ఇప్పటికే సంజయ్ పాదయాత్ర 100 కిలోమీటర్ల మైలు రాయిని దాటేసింది.. అయితే, 17వ తేదీన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర…
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనే టార్గెట్గా విమర్శలు సంధించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్తో బీజేపీ ఎప్పటికీ కలవదని స్పష్టం చేశారు. దళిత బంధులాగే.. బీసీ, గిరిజన బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి కేసీఆర్ ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని విమర్శించారు టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్. 10వ రోజు పాదయాత్ర కొనసాగించిన ఆయన.. ఢిల్లీలో తెలంగాణ భవన్ దేని కోసం? ఎవరి కోసం కడుతున్నారని ప్రశ్నించారు. బీజేపీ…
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… బండికి అడ్డువస్తే పగిలిపోతుందని రాజా సింగ్ హెచ్చరించారు. బండి సంజయ్ పాదయాత్ర 100 కిలో మీటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యం లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంజయ్ పాదయాత్ర విజయవంతంగా సాగుతోందని… ప్రజలు స్వాగతం పలుకుతున్నారని వివరించారు. బండి సంజయ్ పై ప్రజల్లో ఎంత ప్రేమ ఉందొ స్పష్టం అవుతోందని… ఈ యాత్ర సక్సెస్ అయితే కేసీఆర్ ప్రభుత్వం పోతుంది… పేద ప్రజల బీజేపీ సర్కార్ వస్తుందని తెలిపారు.…
తెలంగాణ మున్నూరు కాపు సంఘం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్రకు సంపూర్ణ మద్దతు తెలిపింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుక్క వేణుగోపాల్ ఆధ్వర్యంలో సంజయ్ ను కలిశారు మున్నూరుకాపు నేతలు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… రాష్ట్ర మున్నూరు కాపు సంఘం బీజేపీ యాత్రకు మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ దుర్మార్గ పాలన పోవాలని రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల నాయకులు కుల సంఘాల ప్రజలు రాజకీయాలకతీతంగా…
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మత తత్వ విద్వేషాలు పక్క రగిలిస్తామని… 80 శాతం ఉన్న హిందువులకు బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ అన్నారు. బీజేపీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని తెలిపారు. రెచ్చగొట్టడం ఇంకా మేము మొదలు పెట్టలేదని… ఎంఐఎం అడ్డాను బద్దలు కొట్టి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర సభ పెట్టామని తెలిపారు. ఛాలెంజ్ ఎస్తే ఆ గల్లీ లోకి వచ్చి కాషాయ జండా ఎగురవేస్తామన్నారు.…