బండి సంజయ్.. మరో బాంబ్ పేల్చారుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బండి సంజయ్ వాడిన సర్జికల్ స్ట్రైక్స్ అన్న పదం.. ఎంతటి ప్రభావాన్ని కలిగించిందో మనం ప్రత్యక్షంగా చూశాం. బీజేపీ అనూహ్య ఫలితాలను సొంతం చేసుకుని.. జీహెచ్ఎంసీలో బలం పుంజుకున్న తీరును సైతం గమనించాం. ఇదే ఒరవడిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముందుకు తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇందుకు నిదర్శనం.
ఉత్తరప్రదేశ్ లో మాదిరిగా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. వెంటనే జనాభా నియంత్రణ చట్టం తీసుకువస్తామని బండి సంజయ్ ఈ పాదయాత్రలో ప్రకటించారు. అంతే కాదు.. మతపరమైన రిజర్వేషన్లను సైతం అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు. స్పష్టమైన ఈ విధానంతో పార్టీకి ఎంత వరకూ మైలేజ్ వస్తుందో రాదో తెలియదు కానీ.. కొన్ని వర్గాలు కచ్చితంగా ప్రభావితం అవుతాయని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు.
Also Read
- Eid-ul-Fitr 2026: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు.. ఈద్-ఉల్-ఫితర్ ప్రాముఖ్యత ఏంటి..? ఎలా జరుపుకుంటారు..?
- Gas Cylinder Code: గ్యాస్ సిలిండర్పై ఉండే కోడ్ అర్థం మీకు తెలుసా?
- love Or Attraction: లవ్లో పడిపోయారా..? అది ఆకర్షణ..? లేక ప్రేమేనా..?
- Valentine's Day: వాలెంటైన్ ఎవరు..? ప్రేమికుల దినోత్సవం ఎలా ప్రారంభమైంది..?
కాకపోతే.. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి అనుచరగణం ఎక్కువ కాబట్టి అద్భుత ఫలితాలు సాధించిందని.. ఆ స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు సాధించే అవకాశాలు తక్కువ అని సైతం అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాన్ని బండి సంజయ్ తో పాటు.. బీజేపీ తెలంగాణ వ్యూహకర్తలు, పార్టీ అధిష్టానం కచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుందని.. రాను రాను.. పార్టీ విధానాలు మరింత దూకుడుగా మారబోతున్నాయని సైతం విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో పార్టీ అధ్యక్షులుగా పని చేసిన వారితో పోలిస్తే.. బండి సంజయ్ కాస్త భిన్నంగా ముందుకు వెళ్తున్నారు. ప్రజల నాడిని పట్టుకుని.. అధికార పక్షంపై విమర్శలు చేసే దిశగా ముందుకు పోతున్నారు. రానున్న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సైతం ఘనంగా నిర్వహించి.. అధికార పక్షంపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్.. జనాభా నియంత్రణ చట్టం తెరపైకి తెచ్చి మరో బాంబ్ పేల్చారు.
ఈ ప్రతిపాదనపై.. రాజకీయ వర్గాల్లో చర్చ జరగడం ఖాయం. అలాగే మతపరమైన రిజర్వేషన్లపైనా చర్చ జరగడం అంతకన్నా ఖాయం. ఆయా అంశాలపై అధికార టీఆర్ఎస్ తో పాటు.. ఎంఐఎం పార్టీ ఎలా స్పందిస్తుంది.. మధ్యలో కాంగ్రెస్ ఎలా తల దూరుస్తుంది.. ఇతర పార్టీలు ఏమని స్పందిస్తాయి.. అన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకంగానే మిగిలింది.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!