నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం “NBK107”. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మి శరత్కుమార్ పవర్ ఫుల్ పాత్రలో కన్పించనుండగా, దునియా విజయ్ ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ కు తమన్ సంగీతం అందించగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్.…
శృతి హాసన్ ‘క్రాక్’ హిట్ తో మళ్ళీ స్టార్ హీరోయిన్ల రేసులోకి వచ్చింది. ప్రభాస్ తో “సలార్”, బాలకృష్ణ, గోపీచంద్ సినిమాతో పాటు మరిన్ని మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. సినిమాల విషయం ఇలా ఉండగా, ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం గురించి న్యూస్ కూడా తరుచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాయి. ముఖ్యంగా ఆమె ప్రేమికుడితో కలిసి షేర్ ఛీ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక తరచుగా అభిమానులతో టచ్ లో ఉండే ఈ…
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స కుమారుడి వివాహం హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ మేరకు సీఎం జగన్ దంపతులు వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు. అటు ఈ వివాహానికి టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ కూడా వచ్చారు. ఆయనను మంత్రి బొత్స కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవితో…
వైఎస్సార్సీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహ వేడుకలో టాలీవుడ్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ సందడి చేశారు. ఈరోజు జరిగిన పెళ్లి వేడుకలో చిరంజీవి, బాలయ్య విడివిడిగా వేడుకకు విచ్చేశారు. బాలయ్య గోల్డెన్ కుర్తాలో కన్పించగా, చిరంజీవి క్లాసీ లుక్ లో కన్పించారు. చిరు, బాలయ్య పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టార్ హీరోలిద్దరూ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక హైదరాబాద్ లోనే జరుగుతున్న ఈ పెళ్లి వేడుకకు బండ్ల గణేష్ తో పాటు…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్స్టాపబుల్’ రికార్డులన్నీ బద్దలు కొడుతూ ‘అన్స్టాపబుల్’గా దూసుకెళ్తోంది. పలువురు సెలెబ్రిటీలు పాల్గొన్న పాపులర్ టాక్ షో ‘అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ఇప్పటికే ఐఎండీబీలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటిటి ప్లాట్ఫామ్లో అత్యధికంగా వీక్షించిన షోగా నిలిచి ఆహా అన్పిస్తోంది. ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు రెడ్ కార్పెట్ పరిచిన ఈ యూనిక్ టాక్ షో 40 కోట్ల నిమిషాలకు పైగా ప్రసారమై రికార్డు సృష్టించిందని అధికారికంగా ప్రకటించారు…
నందమూరి బాలకృష్ణకు ‘అఖండ’ వంటి బ్లాక్బస్టర్ను అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన తదుపరి చిత్రం ఏమిటి అనే విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘అఖండ’కు సీక్వెల్ తెరకెక్కుతోందని అంతా భావించారు. కానీ బాలయ్య ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ స్టార్ ఫిల్మ్ మేకర్ హీరో రామ్ తో సినిమా చేయబోతున్నాడట. Read Also : “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్ బోయపాటి శ్రీను రామ్ తో…
ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లతా మంగేష్కర్ అస్తమయం యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఇక లేరన్న విషయాన్ని అభిమానులు, సెలబ్రిటీలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఆమె గత నెల రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లత ఉదయం మరణించారు. ఆమె ఆకస్మిక మరణానికి యావత్ దేశం నివాళులర్పిస్తోంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, చిరంజీవి, నిర్మలా…
ఇప్పటికి అన్ స్టాపబుల్ విత్ యన్బీకే అంటూ ఆహా ప్లాట్ ఫామ్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ టాక్ షో పదిసార్లు అలరించింది. వాటిలో తొమ్మిది ఎపిసోడ్స్ భలేగా సాగాయి. వాటిలోని బెస్ట్ ను తీసుకొని పదో ఎపిసోడ్ గా రూపొందించి అలరించారు. ఇక పదకొండో ఎపిసోడ్ గా జనం ముందు నిలచిన అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ కు గ్రాండ్ ఫినాలే కావడం విశేషం!ఈ ఎపిసోడ్ ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ అన్నిటికంటే మరింత విశేషమైనది. ఎందుకంటే…
ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని కూడా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ బాలకృష్ణ నిరసనకు దిగారు.. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం ను జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా తూముకుంట పారిశ్రామిక వాడ లో పరిశ్రమలు ఉన్నాయని, హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన…
ఏపీలో కొత్త జిల్లాల విభజన సందర్భంగా పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అందులో అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం కూడా ఉంది. పుట్టపర్తి కేంద్రంగా ప్రభుత్వం సత్యసాయి జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆ నిర్ణయాన్ని హిందూపురం నియోజకవర్గ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కనబడడం లేదంటూ స్థానిక బీజేపీ నాయకులు స్థానిక వన్టౌన్…