ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గాన్ని కూడా జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ బాలకృష్ణ నిరసనకు దిగారు.. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. హిందూపురం ను జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా తూముకుంట పారిశ్రామిక వాడ లో పరిశ్రమలు ఉన్నాయని, హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి, సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు.
అర్థరాత్రి హడావుడిగా జిల్లాలు ప్రకటిస్తూ జీవోను జారీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. పుట్టపర్తి అధ్యాత్మిక కేంద్రమని, అక్కడి ప్రజలు ప్రశాంతంగా జీవిస్తుంటారని ఆయన అన్నారు. బాలకృష్ణ కనబడడం లేదని వ్తెసీపీ నాయకులు ఆరోపిస్తున్నారని, ప్రత్యక్షంగా జిల్లా సాధన కోసం పోరాడుతున్నానన్నారు. ఇదీ వ్తెసీపీ నాయకులకు కనబడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కరోనా సమయంలో నేను చేసిన సేవలు ఏవరికీ కనబడలేదని ఆయన మండిపడ్డారు.