Maharashtra: తీరంలోని పాడుబడిన పడవలో ఏకే-47 రైఫిళ్లు.. ఆ ప్రాంతంలో హై అలర్ట్
Maharashtra: మహారాష్ట్ర తీరంలోని ఓ పాడుపడిన పడవలో మూడు ఏకే-47 రైఫిళ్లు, బుల్లెట్లు, పత్రాలు లభ్యం కావడం కలకలం రేపింది. తీరానికి కొట్టుకొచ్చిన ఆ బోటులో ఏకే-47 తుపాకులు లభ్యం కావడంతో ఉగ్రకోణంలో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఆ బోటు ఓ ఆస్ట్రేలియా దంపతులకు చెందినదని వెల్లడించారు. అందులో మూడు తుపాకులు ఉన్నాయని తెలిపారు. లేడీ హాన్ అని పిలవబడే ఈ పడవ ఆస్ట్రేలియన్ పౌరురాలైన హనా లాండర్గన్కు చెందినది. ఆమె భర్త జేమ్స్ హార్బర్ట్ కెప్టెన్ అని ఫడ్నవీస్ చెప్పారు.
రాయ్గఢ్ తీరంలో మూడు ఏకే-47లను మోసుకెళ్తున్న పడవకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉగ్రవాద కోణం కనిపించలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. అయితే, తీరంలో భద్రతను కట్టుదిట్టం చేశామని, ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించామని ఆయన వెల్లడించారు. బోట్ ఇంజిన్లో లోపం తలెత్తడంతో ఆ ఆస్ట్రేలియన్ దంపతులు బోటును వదిలేసి వెళ్లిపోయారని వివరించారు. ఇందులో ఉగ్రవాద కోణం ఏమీలేదని స్పష్టం చేశారు. అయితే, ఆస్ట్రేలియన్లు ఆ బోటులో ఆయుధాలు ఎందుకు తీసుకెళుతున్నారన్నది తెలియరాలేదని చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ముంబై పోలీసులు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు.
Also Read
- Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
- Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
Gotabaya Rajapaksa: అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న గొటబాయ.. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు!
ఐరోపా వెళ్తుండగా.. జూన్ 26న ఇంజిన్ చెడిపోయింది. అదే రోజున బోటులోని వారిని కొరియాకు చెందిన ఓ యుద్ధనౌక కాపాడింది. బోటును మాత్రం అక్కడే వదిలేశారు. అది అలల తాకిడికి మహారాష్ట్ర తీరం దిశగా కొట్టుకువచ్చింది. చివరికి హరిహరేశ్వర్ తీరానికి చేరుకుంది. దీంతో స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. బోటులో తుపాకులను గుర్తించిన వెంటనే, ఉగ్రవాద భయంతో మహారాష్ట్ర తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఇందులో ఉగ్రకోణమేమీ లేదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరినట్లు రాయ్గఢ్ ఎమ్మెల్యే అదితి తట్కరే తెలిపారు. పెద్ద పండుగ అయిన జన్మాష్టమికి ఒక రోజు ముందు ఈ సంఘటన జరగడం వల్ల భద్రతకు పెద్ద భయం కలుగుతోందని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
RR Vs DC: యశస్వి జైస్వాల్ చేసిన పరుగులు 6.. అయినా మరో ప్రపంచ రికార్డు బద్దలు..
-
Buchi Babu: ‘పెద్ది’ని గుండెల్లోంచి తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు.. బుచ్చిబాబు
-
Cylinder Vs Hotels: ‘సిలిండర్ రేట్లు పెరిగాయ్.. అందుకే ధరలు పెంచాం’.. కస్టమర్లకు చుక్కలు చూపిస్తున్న హోటల్స్..
-
Petrol-Diesel prices: పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
-
Sukumar: శిష్యుడిని మెచ్చుకున్న గురువు.. ‘పెద్ది’ లాంటి కమర్షియల్ ఎమోషనల్ రైడ్ ఈ మధ్య రాలేదు: సుకుమార్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!