Asaduddin Owaisi: బంగ్లాదేశ్లో హిందువులపై దాడి.. తీవ్రంగా ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ
- బంగ్లాదేశ్లో కొనసాగుతున్న ఆందోళనలు..
- బంగ్లాలో హిందువులపై దాడిని ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ..
- మైనార్టీల హక్కులను రక్షించాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరిన అసదుద్దీన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: బంగ్లాదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై AIMIM పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీల రక్షణతో పాటు ప్రాంతీయ స్థిరత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఇక, బంగ్లాదేశ్లో దీపు చంద్ర దాస్, అమృత్ మండల్ హత్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అన్నారు. ఈ విషయంలో భారత్-బంగ్లాదేశ్ అర్థవంతమైన చర్చలు కొనసాగేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఎంఐఎం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. అలాగే, బంగ్లాదేశ్ సెక్యులర్, బంగ్లా జాతీయవాద పునాదులపై ఏర్పడిన దేశం, అక్కడ సుమారు 2 కోట్ల మంది ముస్లిమేతర మైనారిటీలు నివసిస్తున్నారని అసదుద్దీన్ ఒవైసీ గుర్తు చేశారు.
Read Also: Coconut Dosa: దూదిలాంటి మెత్తని ‘కొబ్బరి దోశ’.. లంచ్ బాక్స్లోకి బెస్ట్ ఆప్షన్!
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
ఇక, భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు పెరగకూడదని ఆకాంక్షిస్తున్నాను.. అక్కడి ప్రభుత్వం మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉండాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ మైనారిటీల భద్రతకు కట్టుబడి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో శాంతి అత్యంత అవసరం, ముఖ్యంగా భారత్ లోని ఈశాన్య రాష్ట్రల భద్రతకు అది కీలకం అన్నారు. అయితే, ఐఎస్ఐ, చైనా వంటి దేశాలు భారత్కు శత్రుత్వం ఉండటం ఆందోళన కలిగిస్తోందని హెచ్చరించారు. అదే సమయంలో భారత్లో కూడా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఓవైసీ తీవ్రంగా మండిపడ్డారు.
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!