Asaduddin Owaisi: బీజేపీకి బీ-టీమ్ అన్నారు కదా, ఇప్పుడు మీ ఓటమి గురించి ఆలోచించుకోండి..
- బీజేపీకి బీ-టీమ్ విమర్శలపై అసదుద్దీన్ ఓవైసీ స్ట్రాంగ్ రిప్లై..
- మహా మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలకు హితవు..
- ఓడిన పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలని కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం సంచలన విజయాలను నమోదు చేసుకుంది. ఔరంగాబాద్, ముంబై, నాగ్పూర్ వంటి నగరాల్లో తన ఉనికిని చాటింది. మొత్తంగా 125 మంది ఎంఐఎం కార్పొరేటర్లుగా గెలిచారు. అయితే, ఈ విజయంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హర్షం వ్యక్తం చేశారు. తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించినందుకు మహారాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలు ఆత్మపరిశీలిన చేసుకోవాలని ప్రతిపక్షాలకు ఓవైసీ హితవు పలికారు.
Read Also: Her Voice Her Story: భారతీయ సంగీతాన్ని మలుపు తిప్పిన మహిళల కథ.. ‘హర్ వాయిస్.. హర్ స్టోరీ’
Also Read
- Health Awareness Wedding: ఆలోచింపజేస్తున్న ఈ వధూవరుల నిర్ణయం.. ఆ టెస్ట్ తర్వాతే వివాహబంధంలోకి అడుగుపెట్టిన జంట
- Karnataka: మందుబాబులకు కర్ణాటక ప్రభుత్వం బంపర్ ఆఫర్.. భారీగా తగ్గనున్న మద్యం ధరలు!
- Greater Noida: కోటి రూపాయలతో పెళ్లి.. 14 నెలలకే విషాదాంతం! కట్నం వేధింపులకు వివాహిత బలి
- Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎంఐఎం పార్టీ సిద్ధమవుతోందని, ఆసక్తి ఉన్న అభ్యర్థుల పేర్లను పార్టీ ఇప్పటికే కోరిందని అన్నారు. ‘‘ ఇప్పుడు మమ్మల్ని (బీజేపీకి బీ టీమ్) అని దూషించే పార్టీలు తమ గురించి ఆలోచించుకోవాలి. విజయానికి చాలా కారణాలు ఉంటాయి. ఓటమికి ఇలాంటివి ఉండవు. మేమెందుకు గెలిచాం, వారు ఎందుకు ఓడిపోయారు వారే చెప్పాలి’’ అని ఓవైసీ అన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల కలయిక గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఫలితాలు అందరి ముందే ఉన్నాయని, ఏక్నాథ్ షిండే ఇల్లు ఉన్న ప్రాంతంలో ఉద్ధవ్ పార్టీ అభ్యర్థి గెలిచారని అన్నారు. తమ పార్టీ గెలిచిందనే ఆనందంలో ఉన్నానని, ఇతరుల గురించి తనకు తెలియదని ఆయన అన్నారు. పార్టీ గుర్తుపై గెలిచిన అభ్యర్థులు పార్టీతోనే ఉంటారని ఓవైసీ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తన కార్పొరేటర్లను ఏకతాటిపై ఉంచడానికి అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
-
Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..