తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఓ ఖైదీని జైళ్ల శాఖ ఉన్నతాధికారి చిత్రహింసలకు గురిచేశారు. సోమవారం రాత్రి ఉన్నతాధికారి దాడి చేయడంతో ఖైదీకి తీవ్ర రక్తస్రావం అయింది. తన నివాసంలో పనులు చేయించుకుంటున్న ఉన్నతాధికారి.. ఖైదీపై దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజమండ్రి కేంద్ర కారాగారానికి చెందిన ఓపెన్ జైలులో సుభానీ అనే వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. అతడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఓపెన్ ఎయిర్ ఖైదీతో ఓ ఉన్నతాధికారి తన…
చీకటి వ్యాపారంలో మునిగి తేలుతున్న డాక్టర్ల అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో స్కానింగ్ మాఫియాతో డాక్టర్లు చేతులు కలిపారు. ల్యాబ్, స్కానింగ్, ఎక్స్రేలను ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లకు రాసి.. సీల్డ్ కవర్లో డబ్బులు తీసుకొంటున్నారు. లక్షల్లో ప్రభుత్వ సొమ్మును జీతాల రూపంలో తీసుకుంటున్న మదనపల్లె డాక్టర్లకు ఇది ఓ వ్యసనంగా మారింది. రోగులకు వైద్యం చేయాల్సింది మరచి.. అదే రోగులతోనే మూడు పువ్వలు ఆరు కాయలుగా డాక్టర్ల వ్యాపారం కొనసాగిస్తున్నారు. మదనపల్లె జిల్లా అస్పత్రిలో…
మెగా పేరెంట్స్ డే ప్రచారానికి తప్ప ప్రయోజనం ఏమైనా ఉందా? అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ ధనాన్ని ప్రచారాల కోసం ఖర్చు చేశారని మండిపడ్డారు. కొంత మంది తల్లిదండ్రులకు ట్రైనింగ్ ఇచ్చి కార్యక్రమం నిర్వహించారని ఎద్దేవా చేశారు. టీడీపీ చర్యల వలన పిల్లలు బడికి కాకుండా.. పనికి వెళ్తున్నారన విమర్శించారు. విద్యా విధానంలో ప్ప్రభుత్వం చేపట్టే విధివిధానాలను తల్లిదండ్రులకు చెప్పలేకపోయారని శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో శనివారం…
పచ్చని కాపురంలో ఇన్స్టాగ్రామ్ ప్రేమ చిచ్చుపెట్టింది. భార్య వ్యవహారాన్ని పసిగట్టి బుద్ధి చెప్పాలనుకున్న భర్త.. ఆమె ముందే ప్రియుడికి దేహశుద్ధి చేశాడు. భార్యతో మాట్లాడుతున్న ప్రియుడిపై ఆమె భర్త, అతని అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది. మదనపల్లె రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. అన్నమయ్య జిల్లా ములకల చెరువు మండలం వడ్డిపల్లికి చెందిన…
అన్ని కులాలు మద్దతిస్తేనే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం సాధించిందని, సీఎం చంద్రబాబు నాయుడుకు అన్ని కులాలు అండగా ఉన్నాయని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు కులం ఆపాదించిన నీచుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్ని మండిపడ్డారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వస్తే జైలులో వేస్తాం అని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి చర్యలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పరిస్థితులను ప్రభుత్వం గాడిలో పెడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు చొరవతోనే రాష్ట్రానికి గూగుల్, యాపిల్ లాంటి ఎన్నో సంస్థలు వస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే.. వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసింది వైసీపీ నాయకులే అని, నాడు నేడులో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడారని…
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా కొన్నిచోట్ల పడ్డాయి. శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహా సముద్రం మీదుగా ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రోజు ముగిసేనాటికి అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా…
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాహ్మణపల్లిలోని తుమ్మల చెరువు సమీపంలో అద్దంకి-నార్కట్పల్లి హైవేపై గీతిక స్కూల్ వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఘటనా స్థలాన్ని పిడుగురాళ్ల పోలీసులు పరిశీలించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకొని కావలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను శ్రీపొట్టి…
అరెస్టుకు భయపడేది లేదని, సీఎం చంద్రబాబు నాయుడు ఏం చేసుకున్నా తాను సిద్దం అని వైసీపీ పక్ష నేత విజయసాయి రెడ్డి తెలిపారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అదానీతో సత్సంబంధాలు ఉన్నాయిని, తమపై ఎలాంటి ఒత్తిడులు లేవన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి అత్యంత పరిపాలన దక్షుడని, రాష్ట్రంలో తాము ఇచ్చినంత జనరంజకమైన సంక్షేమ పాలన ఎవరూ ఇవ్వలేరన్నారు. సీఎం చంద్రబాబుకు లంచమిచ్చి కేవీ రావు కాకినాడ పోర్టును తీసుకున్నారు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.…
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై కేవీ రావు పెట్టిన కేసును ప్రజలు స్వాగతిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కాకినాడ పోర్ట్ సీఎండీగా ఉన్న కేవీ రావును అప్పట్లో బాగా భయపెట్టడమే కాకుండా బెదిరించారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఎంపీ నాగరాజు పేర్కొన్నారు. ఏపీపై విజయసాయి రెడ్డి…