Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Rammohan Naidu Said We Are Trying To Support Mirchi Farmers

Rammohan Naidu: మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం.. రూ.11,600కు పైగా మద్దతు ధర ఇవ్వాలని కోరాం!

Published Date :February 21, 2025 , 1:15 pm
By Sampath Kumar
  • శివరాజ్ సింగ్ చౌహన్‌తో రామ్మోహన్ నాయుడు భేటీ
  • మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం
  • రైతుల కష్టం తెలిసిన వ్యక్తి శివరాజ్ సింగ్
Rammohan Naidu: మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం.. రూ.11,600కు పైగా మద్దతు ధర ఇవ్వాలని కోరాం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఏపీలోని మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ను కోరామమన్నారు. మిర్చికి రూ.11,600 పైగా మద్దతు ధర ఇవ్వాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశామన్నారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం అని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి అచ్చం నాయుడు, ఏపీ వ్యవసాయ శాఖ అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ… ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. మిర్చి ఉత్పత్తి వ్యయాన్ని రాష్ట్రం రూ.11,600 రూపాయలుగా నిర్ణయించింది. అంతకంటే ఎక్కువ మొత్తంలో రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఇప్పుడు మిర్చి ఎగుమతులు జరగడం లేదు. మిర్చి ఎగుమతులు పెంచడం గురించి కూడా ఇవాళ్టి సమావేశంలో చర్చించాం. రాష్ట్రంలో మిర్చి రైతులు, ఎగుమతిదారులతో సదస్సు పెట్టాలని నిర్ణయించాం. సదస్సు ద్వారా వచ్చిన సలహాలు, సూచనల ఆధారంగా మిర్చి ఎగుమతులు పెంచడంపై దృష్టి పెడతాం’ అని చెప్పారు.

‘మిర్చి రైతుల ఆదాయం ఎలా పెంచాలన్నదే అందరం ఆలోచిస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తెచ్చారు. రైతుల కష్టం తెలిసిన వ్యక్తి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. నిన్న ఢిల్లీలో లేనప్పటికీ మధ్యప్రదేశ్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ సీఎంతో మాట్లాడారు. ఈరోజు ఢిల్లీ వచ్చిన వెంటనే అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. మార్కెట్ రేటుకు, రైతుల పెట్టుబడి వ్యయానికి మధ్య ఉన్న గ్యాప్‌ను కేంద్రం నుంచి నిధులు తెచ్చి ఆదుకోవాలని చూస్తున్నాం. ఉత్పత్తి వ్యయం రూ.11,600 కంటే ఎక్కువగా నిర్ణయించాలని ICARను కోరాం’ అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • mirchi farmers
  • rammohan naidu
  • Shivraj Singh Chouhan

తాజావార్తలు

  • అస్సాంలో సుఖోయ్‌ యుద్ధ విమానం ఆచూకీ గల్లంతు.. గాలిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌..

  • CM Revanth Reddy: విజయ్ – రష్మిక దంపతులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి..

  • AP Govt: సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్..

  • India vs England: సెమీఫైనల్లో సంజు శాంసన్ విశ్వరూపం.. సెంచరీ చేజారిన చెరిగిపోని రికార్డు!

  • India vs England: రఫ్ఫాడించిన సంజు, దూబే.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions