Bird Flu: బర్డ్ ఫ్లూ భయం.. కుదేలైన సండే చికెన్ సేల్స్!
- కుదేలైన సండే చికెన్ సేల్స్
- 1000 రూపాయలు దాటేసిన మటన్ ధర
- 200 రూపాయలకు పైనే చేపల ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బర్డ్ ఫ్లూ భయంతో సండే చికెన్ సేల్స్ కుదేలైపోయాయి. కేజీ 30 రూపాయలు తగ్గించి అమ్మినా.. కొనే దిక్కులేదు. అదే సమయంలో మటన్ 1000 రూపాయలు మార్క్ దాటేస్తే.. ఫిష్ 200 రూపాయలకు పైనే పలుకుతోంది. వైరస్ భయం మనసులో పెట్టుకుని.. చికెన్ తినడం రిస్కే అంటున్నారు జనాలు. అటు బిర్యానీ పాయింట్లు, హోటళ్లలో 40 శాతం అమ్మకాలు పడిపోయాయి. దాంతో వ్యాపారాలు లబోదిబో అంటున్నారు.
బర్డ్ ఫ్లూ భయంతో నాటు కోళ్ల కొనుగోలుకు బారులు తీరారు జనం. చికెన్ షాపులు వెలవెల పోతూ ఉంటే.. నాటుకోళ్ల అమ్మకాలు జరిపే ప్రాంతాలు మాత్రం కలకలలాడుతున్నాయి. ఇదే అదునుగా భావించిన చెన్నై వ్యాపారులు ప్రత్యేక వాహనాల్లో నాటుకోళ్లను తెచ్చి అధిక ధరలకు అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పెరిగే నాటుకోళ్ల అమ్మకాలు జోరందుకోవడంతో.. చెన్నై వ్యాపారులు దానిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గత వారంలో కిలో నాటుకోడి 500 రూపాయలు ధరలు పలకగా.. ప్రస్తుతం 750 రూపాయలు పలుకుతోంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రజలు మాత్రం నాటు కోళ్ల కొనుగోలుకు మక్కువ చూపుతున్నారు.
Also Read
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
- Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
- Digital Train Ticket: వాట్సాప్ టిక్కెట్లకు చెల్లుచీటి.. రైల్వే శాఖ తెచ్చిన సరికొత్త రూల్స్..
- Pakistan: చేతులెత్తేసిన అసిమ్ మునీర్.. పాక్లో BLA-TTP వరస దాడులు..
బర్డ్ ఫ్లూ మహమ్మారి పౌల్ట్రీ రంగాన్ని కుదేలు చేయడంతో.. చేపల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో చేపల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత వారం రోజుల వరకు 100 రూపాయలు కిలో పలికిన చేపలు, ప్రస్తుతం 200 నుంచి 350 పలుకుతూ ఉండడం కొనుగోలుదారులు బిక్క మొఖం వేస్తున్నారు. మాంసం ప్రియులు చేపల కొనుగోలుపై ఆసక్తి చూపుతూ ఉండడంతో.. చేపలు, రొయ్యలు, పీతలు సైతం అందుబాటులో ఉండేలా వ్యాపారులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!