కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి వెంట ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా ఉన్నారు. ఈ భేటీలో కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్చ జరిగింది. గతవారం సీఎం పర్యటనతో “పెట్రో కెమికల్ కారిడార్” ఏర్పాటుకు కేంద్రం సత్వర చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , పెట్రోలియం…
కరోనా పరిస్థితులపై సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని..మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. కేసుల సంఖ్య తగ్గుతోంది, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని.. కోవిడ్ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని.. కోవిడ్ ప్రోటోకాల్స్ను కచ్చితంగా పాటించాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు…
ఏపీలో పేకాట రాజకీయం హీటెక్కిందా? పేకాట క్లబ్ల వెనక ఎవరున్నారో.. ఆ చిట్టా మొత్తం చేరాల్సిన వారి దగ్గరకు చేరిందా? ఆ జాబితాలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు? అధినేత ఎంత చెప్పినా చెవికి ఎక్కించుకోని వారికి బ్యాండ్ బాజాయేనా? ఆ కథేంటో స్టోరీలో చూద్దాం. పేకాటపై వచ్చే ఆదాయం వదులుకోవడం ఇష్టం లేని కొందరు నేతలు గతంలో ఏపీలో పేకాట యధేచ్చగా సాగేది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి కార్డ్స్ ఆడేవారు. జగన్ ముఖ్యమంత్రి…
ప్రజలు కష్టాల్లో వుంటే కరోనా కట్టడి పేరుతో ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు అని ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. అశాస్త్రీయ పద్దతిలో వేక్సినేషన్లు వేస్తున్నారు అని తెలిపారు. చెత్తకు పన్నులు వేస్తారా… 15 శాతానికి మించి ఆస్తిపన్ను పెంచామంటే ప్రజలకు ఏమి అర్ధమవుతుంది. పన్నులు పెంచుతోంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు నోటికి ప్లాస్టర్లు వేసుకుని వున్నారా అని ప్రశ్నించారు. ప్రతి ఇంటికి వెళ్లిప్రజల నుంచి చెత్తను కొనుక్కోండి.. వాటిని అమ్ముకోండి.. ప్రజలపై భారాలు వేయకండి అన్నారు. పన్నుల…
సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ వాహనమిత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మూడో విడత ఆర్థిక సాయాన్ని సర్కార్ విడుదల చేసింది. అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ.. పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో మే 14, 2018న మాట ఇచ్చామని.. ఆటోడ్రైవర్లు నా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో బాదుడు ఎక్కువైంది, పెనాల్టీలు ఎక్కువైపోతున్నాయని ఆవేదన చెందారని.. అప్పులు తెచ్చి ఇన్సూరెన్స్, మరమ్మతులు, పెనాల్టీలు కడుతున్నామని చెప్పారని వెల్లడించారు. వారికిచ్చిన మాటను నిలబెట్టుకుంటూ…
కడప జిల్లా : బ్రహ్మంగారి మఠం వివాదం రోజు రోజుకు ముదురుతోంది. బ్రహ్మంగారి మఠంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీకాంత్ పై నిన్న కొందరు దాడికి ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దాడికి పాల్పడిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ దాడికి ప్రయత్నించిన ఘటనలో ఐదు మందిపై కేసు నమోదు అయింది. బంకు శీను, దీప్తి రమణారెడ్డి బాబ్జి, శ్రీ రాములు నారాయణ రెడ్డి అనే వ్యక్తులపై 452,…
టిడిపిపై ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే రాజధాని తరలింపు ఖాయమని… స్వార్థంతో కూడిన ప్రభుత్వం మాది కాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పోలవరం పూర్తి చేస్తామన్నారు ఏమైనా చేసారా….. పోలవరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి 24 క్లియరెన్స్ గాను 23 క్లియరెన్స్ పూర్తి చేసి దానికి రూపు రేఖలు తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు రాజకీయం కోసం అనేక లేఖలు రాసుకుంటే ఎవరూ నమ్మే…
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దు కోసం టీఎన్ఎస్ఎఫ్ వెరైటీగా నిరసన చేస్తుంది. టీడీపీ కార్యాలయం దగ్గర పీపీఈ కిట్లు ధరించి ఆందోళన చేస్తున్నారు. కోవిడ్ సమయంలో అధికారిక సమావేశాలు నిర్వహించ లేనప్పుడు పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని అంటున్నారు. రాష్ట్రంలో సుమారు 40 లక్షల మంది విద్యార్థులు వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. విద్య శాఖ మంత్రి వెంటనే పరీక్షలు రద్దు ప్రకటించాలి. 14 రాష్ట్రాలు 10 11 తరగతి పరీక్షలు రద్దు చేసినప్పుడు…