విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని కాంట్రాక్టు నర్సుల ఆందోళన చేస్తున్నారు. ప్లే కార్డులతో కోవిడ్ పేషేంట్స్ కు ఇబ్బంది లేకుండా, విధులు నిర్వహిస్తూనే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు పెంచాలని,కాంట్రాట్ ఉద్యోగులను పర్మినెంట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ డ్యూటీ చేస్తూ కోవిడ్ వచ్చి 15 రోజులు సెలవలు పెడితే జీతం కట్ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు నిరసన విరమించేది లేదంటున్నారు నర్సులు.…
విశాఖ మేఘాద్రి రిజర్వాయర్ దగ్గర మద్యం మత్తులో రెండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విశాఖ నగరానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ పి .అశోక్ కుమార్ స్నేహితులతో కలిసి మందు పార్టీ జరుపుకొని, మేఘాద్రి రిజర్వాయర్లో ఈతకు దిగి, గోపాలపట్నం 89 వ వార్డు ప్రాంతానికి చెందిన యువకులతో ఘర్షణ పడి కొట్లాటకు దిగారు. అక్కడ గొడవ సద్దుమణిగి కొత్తపాలెం ప్రాంతానికి చెందిన యువకులు భగత్ సింగ్ నగర్ వద్ద కాపు కాసి దాడి…
ఏపీ సిఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రుల తీరిక లేని షెడ్యూల్ వల్ల సిఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కలవాలని భావించినా.. జగన్ మాత్రం పర్యటనను వాయిదా వేసుకున్నారు. గురువారం రోజున సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం నిధులు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ సోమవారం ఢిల్లీ వెళ్ళి..…
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబుది ఎప్పుడూ దొంగ చూపే అని చురకలు అంటించారు. “బాబు మాయలో పడి పోతురాజులా కొరడాతో వాతలు తేలేలా కొట్టుకునే వారికి కొంచెం ఆలస్యంగా అర్థమవుతుంది. ఎవరో ఉసిగొల్పితే పిచ్చి చేష్టలు చేసి ఒళ్లు హూనం చేసుకున్నామని పశ్చాతాప పడతారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజి జరిగిపోతుంది. ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకోవాలని సిఎం జగన్ గారు ముందుచూపుతో వ్యవహరిస్తుంటారు. 40 ఇయర్స్…
ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 8976 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1758339 కు చేరింది. ఇందులో 16,09,879 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,23,426 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక…
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టిడిపి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల ఫైర్ అయ్యారు. కరోనా కట్టడి విషయంలో, వైసిపి ప్రభుత్వం విఫలమైందని.. కరోనా వస్తే పారాసేటమాల్, బ్లీచింగ్ సరిపోతుందని జగన్ చెప్పారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యంతోనే ఏపీ ప్రమాదంలో పడిందని..అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా కట్టడిలో తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా హాస్పిటల్స్ కు వెళ్లి పేషంట్లకు ధైర్యం చెబుతున్నారని తెలిపారు. మన ముఖ్యమంత్రి నాలుగు గోడల నుండి బయటకు రావడంలేదని..ఒక ప్రజా ప్రతినిధిగా ప్రాణాలు…
ప్రభుత్వ మద్యం షాపుల్లో నగదు అవకతవకలపై లోతైన విచారణ జరపనున్నారు. విశాఖ సర్కిల్-4పరిధిలో నాలుగు షాపుల్లో నగదు పక్కదారిపట్టి నట్టు నిర్ధారణ అయింది. మొత్తం 33లక్షల రూపాయలు నొక్కేసారు సిబ్బంది. ఇందులో బాధ్యులైన సిఐ శ్రీనివాస్ ను విధుల నుంచి తప్పించారు ఉన్నతాధికారులు. ఇద్దరు కానిస్టేబుళ్లపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. జిల్లాలో స్పెషల్ డ్రైవ్ కు ఆదేశించిన అధికారులు.. సూపర్ వైజర్లు, వైన్ షాప్ సిబ్బంది ని విచారిస్తున్నారు. ఇంకా 12మంది సిబ్బందికి నోటీసులు ఇచ్చాము. నిధులు…
విశాఖ ఎక్సయిజ్ స్కామ్ లో తీగలాగితే డొంక కదులుతుంది. ప్రభుత్వ వైన్ షాపుల్లో భారీగా నిధులు గోల్ మాల్ చేసినట్లు తెలుస్తుంది. విశాఖ పరిధిలోని 14షాపుల్లో నగదు తేడాలు గుర్తించారు. లక్షల రూపాయలు పక్కదారి పట్టించారు సిబ్బంది. వ్యవహారం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన అక్రమార్కులు నొక్కేసిన నగదు చెల్లించేందుకు అంగీకరించినట్టు సమాచారం. సర్కిల్-4లో వెలుగు చూసిన సిబ్బంది చేతివాటంతో విచారణ మొదలయింది. ఫేక్ చలాన్ల తో బ్యాంకు, ప్రభుత్వాన్ని మోసం చేసి లక్షల రూపాయలు మాయం చేసారు.…
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండటంతో తిరుమలకు వస్తున్న భక్తుల సంఖ్య పేయుగుతుంది. నిన్న శ్రీవారిని 13516 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక 5227 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… నిన్న శ్రీవారి హుండి ఆదాయం 51 లక్షలు. అయితే ఈనెల 19న టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ప్రస్తుత పాలకమండలి గడువు 21న ముగియనుంది. అయితే పాలకమండలి నియామక సమయంలో నిర్దిష్ట కాలపరిమితి విధించకపోవడంతో…. తదుపరి పాలకమండలి నియామకం జరిగే వరకు ప్రస్తుత పాలకమండలి కోనసాగే వెసులుబాటు…
మందు పంపిణీపై ఎట్టకేలకు ఆనందయ్య స్పందించారు. కొంత ఇబ్బంది ఉన్న మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని..మొదట నియోజకవర్గంలో ఇచ్చి తర్వాత ఇతర ప్రాంతాలకు ఇద్దామని ఎమ్మెల్యేతో తానే చెప్పానని పేర్కొన్నారు. పంపిణీపై సోమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని..సోమిరెడ్డి మాట్లాడింది అవాస్తవమని విమర్శలు చేశారు. మీ సొంత గొడవలోకి తనను లాగవద్దన్నారు. తనను ప్రజాసేవ కోసం ఉపయోగించుకోవాలని..రాజకీయాల్లోకి లాగొద్దని మండిపడ్డారు. సోమవారం నుంచి ముందు పంపిణీ జరుగుతుందని… ఏవైనా పెద్ద ఆటంకాలు వస్తే తప్ప.. పంపిణీ…