కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. మంత్రి వెంట ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా ఉన్నారు. ఈ భేటీలో కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటుపై చర్చ జరిగింది. గతవారం సీఎం పర్యటనతో “పెట్రో కెమికల్ కారిడార్” ఏర్పాటుకు కేంద్రం సత్వర చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , పెట్రోలియం సెక్రటరీలు చర్చించి ఈ అంశంపై ఒక ప్రణాళిక రూపొందిచారు. వీలైనంత త్వరలో రాష్ట్రంలో “పెట్రో కెమికల్ కారిడార్” ఏర్పాటు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి తెలిపినట్లు సమాచారం. “పెట్రో కెమికల్ కారిడార్”తో రాష్ట్రంలో 50 లక్షల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. అలాగే రాష్ట్రంలో “గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ” ఏర్పాటుతో ఇథనాల్ ఉత్పత్తికి కేంద్రం సుముఖతంగా ఉందని… ఇథనాల్ ఉత్పత్తి ప్లాంట్లకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని మంత్రి చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
-
NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!