Amara Charitable Trust: పేదల సాధికారతకు ‘అమరా ఛారిటబుల్ ట్రస్ట్’ చేయూత.. బోగోలు అభివృద్ధికి రూ.15 కోట్ల విరాళం!
- పేదల సాధికారతకు అమరా ఛారిటబుల్ ట్రస్ట్ చేయూత
- బోగోలు అభివృద్ధికి రూ.15 కోట్ల విరాళం
- మంత్రి నారా లోకేష్ను కలిసిన బచ్చు కృష్ణ కుమార్ దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేదల సాధికారత కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమానికి నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ భారీగా సహకారం అందించనుంది. ఈ సందర్భంగా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు ఉండవల్లిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను కలిసి తమ సహాయాన్ని ప్రకటించారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ.5 కోట్ల సాయం అందించనున్నట్లు తెలిపారు. త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రిని ఆహ్వానించారు.
పీ-4 కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న మన బడి – మన భవిష్యత్ పథకం కింద బోగోలు మండలంలోని పలు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచనున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రవాస భారతీయులు, పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దాతలు ఇచ్చే విరాళాల ఆధారంగా ఆయా పాఠశాలలకు వారి పేర్లు పెట్టుకునే అవకాశం కూడా కల్పించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు త్వరలోనే ‘మన బడి – మన భవిష్యత్’ వెబ్సైట్ను కూడా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
Also Read: Sanju Samson Award: సంజు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’పై రచ్చ.. మిచెల్ సాంట్నర్ కీలక వ్యాఖ్యలు!
అమరా బచ్చు ఛారిటబుల్ ట్రస్ట్ విద్యా రంగంతో పాటు ఆరోగ్య, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికీ చేయూత అందిస్తోంది. బోగోలు మండలం కొవ్వూరుపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కోసం రూ.5 కోట్ల సాయం అందించనుంది. అదేవిధంగా కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం మరో రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. ఈ విధంగా విద్య, ఆరోగ్యం, ఆధ్యాత్మిక రంగాల్లో మొత్తం రూ.15 కోట్ల సహాయం అందించనున్న అమరా ఛారిటబుల్ ట్రస్ట్ చర్యలు స్థానికంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..