టిడిపిపై ఏపీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. త్వరలోనే రాజధాని తరలింపు ఖాయమని… స్వార్థంతో కూడిన ప్రభుత్వం మాది కాదని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పోలవరం పూర్తి చేస్తామన్నారు ఏమైనా చేసారా….. పోలవరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి 24 క్లియరెన్స్ గాను 23 క్లియరెన్స్ పూర్తి చేసి దానికి రూపు రేఖలు తెచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు రాజకీయం కోసం అనేక లేఖలు రాసుకుంటే ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని.. భూకబ్జా చేసి రౌడీయిజలు, హత్యలు చేసిన వారిపై కేసుపెట్టొద్దు అంటే ఇది ఎక్కడి న్యాయమని మండిపడ్డారు. మేము టీడీపీ వాళ్ళము, మేము ఏదైనా చేస్తామంటే కూదరదన్నారు.
గత ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు ముద్రగడ పద్మనాభాన్ని ఏమి చేశారు… విమానాశ్రయం దగ్గర ఏ తప్పులు చేయకపోయినా ఎన్ని అక్రమ కేసులు మాలాంటి వారిపై పెట్టారని ఫైర్ అయ్యారు.అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని చేస్తున్నామని..కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని చూస్తుంటే ప్రతిపక్షం అడ్డుపడుతుందని ఫైర్ అయ్యారు. ఎన్నికలు ముగిసిన మరుసటిరోజే.. బీజేపీకి అధిక మెజారిటీ రావడం మా దురదృష్టమని ఢిల్లీలో సీఎం జగన్ అన్నారని…ప్రతిపక్షంలో ఎవరైనా అన్నారా ? అని టిడిపికి చురకలు అంటించారు. ప్రతిపక్షలో ఉన్న చంద్రబాబు మోడీని ఒక్కమాట అనడానికి కూడా భయపడి వణుకిపోతున్నాడని మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి.