ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులినెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 87,756 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 5741 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, 53 మంది మృతిచెందారు.. మరోవైపు.. 24 గంటల్లో 10,567 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,20,134 కు చేరుగా.. ఇప్పటి వరకు 12,052 మంది మృతిచెందారు.. రికవరీ కేసులు 17,32,948 కు పెరగగా.. ప్రస్తుతం 75,134 యాక్టివ్ కేసులు ఉన్నాయి.