కరోనా జీరో స్థాయికి చేరుతుందని.. ఎప్పటికీ అనుకోవద్దు : సిఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పరిస్థితులపై సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని..మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. కేసుల సంఖ్య తగ్గుతోంది, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని.. కోవిడ్ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని.. కోవిడ్ ప్రోటోకాల్స్ను కచ్చితంగా పాటించాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు తదితర చర్యలన్నీ కొనసాగాలి, ఇవి మన జీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు. ఫోకస్గా టెస్టులు చేయాలని.. గ్రామాల్లో చేస్తున్న ఫీవర్ సర్వే కార్యక్రమాలు ప్రతి వారం కొనసాగాలని ఆదేశించారు.
టెస్టులు ఇష్టానుసారం కాకుండా ఫోకస్గా, లక్షణాలు ఉన్నవారికి చేయాలని..ఎవరైనా కోవిడ్ పరీక్షలు చేయమని అడిగితే వారికి కూడా చేయాలన్నారు. అన్ని ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని.. ఆరోగ్య శ్రీ అమల్లో కలెక్టర్లను అభినందిస్తున్నానని పేర్కొన్నారు. 89 శాతం మంది కోవిడ్ ట్రీట్మెంట్ను ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నారని.. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారంపడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారని కొనియాడారు. థర్డ్వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదని..మనం ప్రిపేర్గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశమన్నారు. వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని.. థర్డ్వేవ్లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నారని తెలిపారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!