Paddy Bills Fraud: రైతుల పంట సొమ్ము అక్రమాలపై కలెక్టర్ సీరియస్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పంటసొమ్ము చెల్లింపుల అక్రమాలపై జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తీవ్రంగా స్పందించారు. రావులపాలెం(మ)దేవరపల్లిలో రైతుల పంట సొమ్ము అక్రమాలపై స్పందించిన కలెక్టర్ హిమాన్సుశుక్లా విచారణకు ఆదేశించారు. 20 మంది రైతుల ఖాతాల్లో కోటి 20 జమ అయిన సొమ్మును వెంటనే రికవరీ చేయాలంటూ రావులపాలెం తహసీల్దార్ కు ఆదేశాలు జారీచేశారు. దేవరపల్లి లో ఈకెవైసి చేయకుండా 37 మంది 2కోట్ల 70 లక్షలు ధాన్యం సొమ్ము మంజూరు అయింది.
దీంతో 20 మంది రైతుల ఖాతాల్లో కోటి 20 జమ అయింది. మరో12మంది ఖాతాల్లో నగదు నిలుపుదల చేశారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లారావులపాలెం మండలం దేవరపల్లిలో రైతుల పంట సొమ్ము అక్రమాలపై కలెక్టర్ హిమాన్సుశుక్లా స్పందించారు. రావులపాలెం మండలం దేవరపల్లిలో రైతుల పంట కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. పంట నమోదు చేసి కొందరు రైతుల పేరునే మొత్తం భూమిని నమోదు చేసి దళారుల ద్వారా ధాన్యం కొనుగోలు చేసుకొనేందుకు సహకరించారని అధికారుల విచారణలో తేలింది. దీంతో గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎస్ కె ఇసాద్ వలీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. 2కోట్ల 70 లక్షల పంటల కొనుగోలు సొమ్ము కొందరి రైతుల ఖాతాల్లో మాత్రమే జమ చేశారు.
Also Read
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
37 మంది రైతుల ఖాతాల్లో మొత్తంగా నగదు జమ జరిగింది. ఇప్పటికే 20 మంది రైతుల ఖాతాల్లో కోటి 20 లక్షల రూపాయలు నగదు విత్ డ్రా కాగా మిగిలిన 17మంది ఖాతాల్లో జమ అయిన నగదును అధికారులు నిలుపుదల చేశారు.దేవరపల్లి గ్రామ 2 ఆర్ బికె సెంటర్ లో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ రైతు భరోసా కేంద్రం పరిధిలో సాగు చేసే రైతుల మొత్తం పంట నమోదు చేయకుండా ఆ మొత్తం భూమిని కొంత మంది పేరున నమోదు చేసారు. దీంతో ఒక్కో రైతు ఖాతాలో పది లక్షల నగదు పడటంతో అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేయగా రైతుల పంట నమోదు జరగని వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కోనసీమ కలెక్టర్ హిమాన్సు శుక్లా సంబంధిత విఎఎ వలీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మిగిలిన అధికారుల పాత్ర ఏదైనా ఉందనేది దానిపై కూడా విచారణ చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పటికే మూడు చోట్ల ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రైతుల ఖాతాల్లో జమ అయిన నిధులను రికవరీ చేయాలని కలెక్టరేట్ ఆదేశించడంతో రావులపాలెం తహశీల్దార్ వెంటనే చర్యలు చేపట్టారు.
Read Also: Jagadish Reddy : మోడీ సొంత రాష్ట్రంలో ఆసరా ఫించన్ 750 రూపాయలే
తాజావార్తలు
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!