కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లకు నో ఏ ఎంట్రీ నిబంధన వివాదాస్పదంగా మారింది. రిజిస్ట్రేషన్ అధికారులు డాక్యుమెంట్ రైటర్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డాక్యుమెంట్ రైటర్లకు ఎంట్రీ లేదని చెప్పడం వివాదంగా మారింది. కర్నూలు జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో గత నెలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూలు, కల్లూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లలో దాడులు నిర్వహించి డాక్యుమెంట్ రైటర్ల నుంచి అనధికార…
మండువేసవిలో వర్షం పడితే బాగానే వుంటుంది. కానీ ఆ వర్షం బీభత్సంగా మారితే నష్టం తీవ్రత చాలా ఎక్కువగా వుంటుంది. నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. మెట్ట ప్రాంతంలో కోతకు వచ్చిన పంట నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు కళ్ళ ముందే నేల కొరగడంతో రైతులు ఆవేదన అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, ఆత్మకూరు, డక్కిలి, వెంకటగిరి ప్రాంతాల్లోఉరుములు..మెరుపులు. ఈదురు…
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావుని ఆకాశానికెత్తేశారు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు. శ్రీకాకుళంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శతజయంతి ఉత్సవాలు జరిగాయి. జలగం వెంగళరావు రాజాం దగ్గర సోపేరు అనే చిన్న గ్రామంలో జన్మించారన్నారు మంత్రి ధర్మాన. మొదట్లో జలగం వెంగళరావు శ్రీకాకుళంలో జన్మించారని చాలామందికి తెలియదు. జిల్లా నుండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి వెంగళరావు ఒక్కరే అన్నారు. దేశంలో ముఖ్యమంత్రి పదవి కి వన్నె తెచ్చిన వ్యక్తి. గతంలో పనిచేసిన…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు తిరుపతికి రానున్నారు. ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు బయలుదేరతారు సీఎమ్ జగన్. అనంతరం పదకొండున్నర గంటల ప్రాంతంలో ఎస్వీ యూనివర్శిటీకి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్. అక్కడ జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో మాట్లాడనున్నారు సీఎం జగన్. అనంతరం 12 గంటలకు సీఎమ్ ప్రసంగం వుంటుంది. ఒంటి గంటకు పద్మావతి పిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కు భూమి పూజ, శంఖుస్థాపన…
మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆర్ కె రోజా బిజీ అయిపోయారు. వివిధ అధికారిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె పర్యటించారు. అక్కడ బాస్కెట్ బాల్ పోటీలను ఆమె ప్రారంభించారు. తాజాగా విజయవాడలో ఆమె శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ క్రీడాప్రాంగణములో శిక్షణా శిబిరాలను ప్రారంభించి ప్రసంగించారు. కరోనా వల్ల రెండు ఏళ్లు క్రీడాకారులు ఇళ్ళకే పరిమితం అయ్యారు. క్రీడలు ఆరోగ్యాన్ని, అవార్డులను తెచ్చి పెడతాయి. 48 విభాగాల్లో…
ఏలూరు జిల్లాలో లాకప్ డెత్ చోటుచేసుకుంది. భీమడోలు పోలీసు స్టేషన్ లో నిందితుడు లాకప్ డెత్ కి గురైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, నిందితుడు ఉరివేసుకుని మరణించాడంటున్నారు పోలీసులు. ఓ చోరీ కేసులో మూడు రోజుల క్రితం అప్పారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు భీమడోలు పోలీసులు. సూరప్పగూడెంకు చెందిన అప్పారావు స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అప్పారావు బాత్రూమ్ లో ఉరివేసుకున్నాడంటున్నారు పోలీసులు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్నాచింగ్ కేసులో పోలీసులు…
మండువేసవిలో భాగ్యనగరంలో వాన బీభత్సం సృష్టించింది. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్లోని పలు కాలనీలు జలమయం కావడం మనం చూశాం. తాజాగా కురిసిన వర్షం కారణంగా కాలనీలు చిన్నపాటి చెరువులను తలపించాయి. హైదరాబాద్ లో కురిసిన భారీవర్షానికి బోట్లను వినియోగించడం కనిపించింది. పాతబస్తీ బాబా నగర్ లో యువకులు కొందరు బోట్లతో షికారు చేస్తూ కనిపించారు.హైదరాబాద్ బోట్ల వినియోగం గతంలోనూ కనిపించింది. వర్షాకాలం వస్తే బోట్లు అందుబాటులోకి తేవాలని కాలనీ వాసులు గతంలో కోరిన సందర్భాలున్నాయి. ఒకవైపు కాలనీల్లో…
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినా..అక్కడక్కడా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలంటున్నారు నిపుణులు. ఇదిలా వుంటే పిల్లల వ్యాక్సినేషన్ సురక్షితమేనని నిపుణులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తన కీలక తీర్పు వెల్లడించింది. నిపుణులు తమ అభిప్రాయం చెప్పాక తాము నిర్ణయాన్ని వెలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో పిల్లలకు కొవిడ్ టీకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. శాస్త్రీయ ఏకాభిప్రాయం, ప్రపంచ సాధికార సంస్థల సూచనలకు అనుగుణంగానే ఉన్నట్లు…
తెలంగాణ-ఏపీ మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ కోసం నేను ఎన్నోసార్లు తీవ్ర ప్రయత్నం చేశానన్నారు మాజీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. విజయవాడలో లారీ ఓనర్ల సంఘం సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ కోసం మూడేళ్లుగా మేము చేయని ప్రయత్నమంటూ లేదు.ఆర్టీసీకి కాకపోయినా లారీ ఓనర్లకైనా పర్మిట్లు ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నించా. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు లేక తెలంగాణ లారీ ఓనర్లే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.ఏపీ ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా…