కరువు ప్రాంతాలుగా ముద్ర వేసుకున్న రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని వసతి కల్పించి దుర్భిక్షంలో ఉన్న ప్రాంతాలను సుభిక్షం చెయ్యాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి సంకల్పించుకున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరుగుతాయన్నారు. మరి పార్లమెంట్ ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారో.. అనేది తెలియదని చెప్పారు. అట్టడుగు వర్గాల రాజకీయ సాధికారత సాధించడమే సీఎం జగన్ లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు.
Cyclone threat to AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి రేపటికి వాయుగుండంగా మారుతుందని అమరావతి వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆపై వాయవ్య దిశగా కదిలి.. డిసెంబర్ 2 వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొంది. డిసెంబర్ మొదటి వారంలో తుపాను తీరం దాటొచ్చని అమరావతి వాతావరణ శాఖ…
Rains in AP for three days Due to Low pressure in Bay of Bengal: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో 48 గంటల్లో తుపానుగా…
రాష్ట్రంలో బీసీలు బాగుపడితే సీఎం వైఎస్ జగన్కు కడుపు మంట అని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కూన రవికుమార్ విమర్శించారు. రాష్ట్రంలో జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోందిని.. దళితులను, బీసీలను అవమానించే యాత్ర జరుగుతుందన్నారు. జగన్ అరాచకాలు, దోపిడీ, అత్యాచారంపై ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పోస్టులు పెట్టించారని రవికుమార్ మండిపడ్డారు. రాష్ట్రంలో పేరుకే బీసీ మంత్రులు ఉన్నా పెత్తనం అంతా రెడ్లదే అని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో కూన రవికుమార్ మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో…
వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు విసిరిన సవాలును టీడీపీ స్వీకరించింది. ఆర్యవైశ్యులకు ఎవరేం చేశారోననే దానిపై వచ్చే నెల 3వ తేదీన చర్చకు రావాలని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో, జగన్ ప్రభుత్వం ఏం చేసిందో వివరించటానికి తాము సిద్దమని, డిసెంబర్ 3న ఉదయం 11.30గంటలకు విజయవాడ వన్ టౌన్ లో కొత్తగుడుల కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చర్చకు రావాలని సవాల్ స్వీకరించారు. ‘దమ్ముంటే వెలంపల్లి శ్రీనివాసరావు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆర్కె రోజా మండిపడ్డారు. చంద్రబాబు పురాతన దేవాలయాలు కూల్చి బాత్రూంలు కట్టాడని, దేవాలయాలు అన్నింటినీ సీఎం జగన్ పునరుద్ధరిస్తున్నారన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద భవానీ ఐల్యాండ్లో ఆదివారం కార్తీక మహోత్సవం నిర్వహించారు. కార్తీక మహోత్సవంలో భాగంగా శివపార్వతుల కళ్యాణం జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా పాల్గొన్నారు. Also Read: Vellampalli Srinivasa Rao: టీడీపీ ఆపీస్కు…
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లకు ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఛాలెంజ్ విసిరారు. ఆర్యవైశ్యులకు తాను ఏం అన్యాయం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని, టీడీపీ ఆపీస్కు రమ్మన్నా కూడా తాను సిద్ధమే అంటూ వెలంపల్లి సవాల్ చేశారు. ఆర్యవైశ్య సంఘాల ముసుగులో తనను ఇబ్బందిపెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య వైభవం కార్యక్రమం జరగకుండా మాజీమంత్రి వెల్లంపల్లి అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన…