ఏపీలో ఎక్కడ వాహనాలు తనిఖీలు చేపట్టినా భారీగా గంజాయి దొరుకుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. అనుమాన వచ్చిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా సుమారు 6 కోట్లు విలువ చేసే నిషేదిత గంజాయిని పట్టుకున్నట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. Read Also : వీడియో : స్కూటీపై టపాసులు తీసుకెళ్లుండగా పేలుడు.. తండ్రికొడుకులు దుర్మరణం.. ఈ నేపథ్యంలో గంజాయి రవాణాను అరికట్టేందుకు…
గురజాల అభివృద్ధిపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా అంటూ గురజాల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి సవాల్ విసిరారు. గురజాలలో టీడీపీ ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించండి. దాచేపల్లి నడిసెంటర్లో అయినా సరే, బొడ్రాయి సెంటర్ లో అయినా సరే, చర్చకు నేను ఒక్కడినే వస్తా, లెక్కలు తేల్చుకొని వెళ్తా, టీడీపీ వారు సిద్ధమా’ అంటూ ఛాలెంజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటున్నామని దుష్ప్రచారం చేస్తున్నారని, మేము నిజంగా అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు…
రేపు ఏపీ బంద్కు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. విజయనగరంలోని లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ ముందు చెరకు రైతులు బకాయిలు చెల్లించాలంటూ బుధవారం నిరసనకు దిగారు. వారిని అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై రైతులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్ణణలో ఆరుగురు రైతులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో గురువారం రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రేపు ఏపీ బంద్కు పిలునిచ్చారు. రైతులందరూ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో కరానోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా రాష్ట్రంలో 36,373 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 301 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారనైంది. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందగా.. 367 మంది కరోనా నుంచి కొలుకున్నారు. ప్రస్తుతం రాష్రంలో 3,830 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
ఓ వార్డు వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వార్డు వాలంటీర్గా విధులు నిర్వర్తిస్తున్న రవి కుమార్ అనే వ్యక్తి తాడేపల్లిలో నిన్నటి నుంచి కనిపించడం లేదు. అయితే రవికుమార్ ఈ రోజు నదిలో శవమై కనిపించాడు. దీంతో రవికుమార్ శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేయడంతో అతడు వాలంటీర్ రవికుమార్గా గుర్తించారు. అంతేకాకుండా అతడి వద్ద సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లు పోలీసులు…
తిరుపతిలో నవంబర్ 14న జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన జరుగనుంది. అయితే కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై అధికారులతో జగన్ సమావేశమయ్యారు. ఏపీ విభజన చట్టంలో పెండింగులో ఉన్న అంశాలు, తమిళనాడు నుంచి తెలుగు గంగ ప్రాజెక్టులో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, రూ. 6300 కోట్ల విద్యుత్బకాయిలు,…
జగన్ సర్కార్ ఆధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దీంతో అమరావతి అభివృద్ధికి భూములిచ్చి రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 45 రోజుల మహా పాదయాత్రకు రాజధాని రైతులు శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర నవంబర్ 1 నుంచి ప్రారంభమైంది. నేడు రెండవ రోజు పాదయాత్రను ప్రారంభించనున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తాడికొండ నుండి గుంటూరు శివారు ప్రాంతం వరకు 12.6 కిలో మీటర్ల…
ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి స్మారకార్థం అవార్డులు ప్రధానత్సవ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుజాతి తరఫున అందరికి శుభాకాంక్షలు.. కేంద్రం పద్మ అవార్డులను, భారతరత్న వంటి అవార్డులతో సత్కరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి అవార్డులు ఇవ్వాలని వైఎస్ఆర్ అవార్డులు ఇస్తున్నాం’ అని అన్నారు. ‘నిండైన తెలుగుదనం నాన్నగారి పంచెకట్టులో కనిపిస్తుంది. ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఆ మహామనిషి…
ఏపీలో 3 రాజధానులు చేస్తామని సీఎం జగన్ ప్రకటించిననాటి నుంచి అమరావతి రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. ఏపీని అభివృద్ధి చేసేందుకే 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని వైసీపీ నేతలు చెబుతుంటే.. వైసీపీ ప్రభుత్వం మొండి వైఖరితో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయటం లేదంటూ టీడీపీతో పాటు వివిధ పార్టీల నేతలు అంటున్నారు. అంతేకాకుండా రాజధాని అమరావతి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతులు తమ త్యాగం వృధా అయిందని ఆవేదన చేస్తున్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలని…
విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలవుదీరిన కనకదుర్గమ్మను దర్శించేందుకు వెళుతున్న భక్తులకు అధికారులు పలు సూచనలు చేశారు. ఇంద్రకీలాద్రి పలు ప్రాంతాల్లో పనులు చేపట్టనున్న నేపథ్యంలో.. ఘాట్రోడ్డుపై రాళ్లు జారిపడే అవకాశం ఉండటంతో కొండపైకి వచ్చే వాహనాలను ఆంక్షలు విధించారు. కొండపైకి వాహనాల్లో వెళ్లాలనుకునే భక్తులు అర్జున వీధి నుంచి అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మూడు రోజుల పాటు పనులు కొనసాగనున్న క్రమంలో ఘాట్ రోడ్డుపైకి వాహనాల అనుమతించబడవని అధికారులు వెల్లడించారు. అలాగే కార్తీకమాసం సందర్భంగా దీపావళి…