ఏపీలో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్వర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ స్పెషల్ సీఎస్గా కేఎస్ జవహర్ రెడ్డి, టీటీడీ ఈఓగా జవహర్ రెడ్డికి అదనపు భాద్యతలు అప్పగించారు. వీరితో పాటు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా శ్యామల రావు, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ స్పెషల్ సీఎస్గా జి. సాయి ప్రసాద్, ఆర్థికశాఖ కార్యదర్శి(కమర్షియల్ టాక్స్)గా ముఖేష్ కుమార్ మీనా ను బదిలీ చేశారు. అంతేకాకుండా పాఠశాల…
ఏపీలోని నెల్లూరు కార్పొరేషన్ తో పాటు కుప్పం పెండింగ్లో మరో 12 మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కాగా అందరి దృష్టి ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఫలితాలపైనే ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటైన కుప్పంలో ఈ సారి ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని నిర్ణయించుకుంది. కుప్పంను వదులుకునే ప్రసక్తి లేదని టీడీపీ నేతలు సైతం భీష్మించుకున్నారు. ఈ నేపథ్యంలో కుప్పం ఫలితాలపై ఏపీ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.…
తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేందర్, బొత్స సత్యనారాయణ, గౌతం రెడ్డి, కృష్ణదాస్, బాలినేని, కన్న బాబులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 5 పరిశ్రమలకు ఎస్ఐపీబీ గ్నీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించారు. అయితే రూ.2,134 కోట్లతో 5 పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 7,683 మంది…
ఏపీలో పురపోరు ముగిసింది. నెల్లూరు కార్పోరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 36 సర్పంచ్లకు, 68 పంచాయతీ వార్డు మెంబర్ స్థానాలకు మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. అనంతరం కౌంటింగ్ కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పుల్లయ్యగూడెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరచిన చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విశాఖపట్నం కొయ్యూరు మండలం బాలవరం సర్పంచ్ గా…
తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల మధ్య సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం కావాలని, దీనికోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల విభజనతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రాన్ని విడగొట్టి ఏడేళ్లు గడిచినా హామీలు అమలు కావడంలేదన్నారు. సమస్యలన్నీ అపరిష్కృతంగానే ఉన్నాయని, వీటితో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు వ్యయ నిర్ధారణలో 2013–14 ధరల సూచీతో రాష్ట్రానికి…
రేణిగుంట ఎయిర్పోర్టు సమీపంలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొనడానికి ఏపీ సీఎం జగన్ తిరుపతికి రానున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్పోర్టు చేరుకున్న జగన్.. తన కాన్వాయ్లో తిరుపతికి బయలుదేరారు. అయితే అలా మొదలై సీఎం కాన్వాయ్ వెంబడి ఓ మహిళ పరిగెత్తుతూ వచ్చింది. ఇది గమనించిన సీఎం జగన్ కాన్వాయ్కి నిలిపివేయించి.. ఓఎస్డీని ఆ మహిళ దగ్గరకు పంపించారు. అంతేకాకుండా ఆ మహిళ…
ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో భర్తీ కానున్న 11 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటించారు. మొత్తం 14 లో 7 ఓసీలకు, 7 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ లకు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇదే ఆఖరు కాదని, ఇప్పుడు సర్దుబాటు చేయలేక పోయిన వారికి…
పీఆర్సీపై నివేదిక ఇస్తేనే ఇండ్లకు వెళుతామని పట్టుబట్టిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు వెనుదిరిగారు. ఏపీ సెక్రటేరియల్లో సుమారు 5 గంటల పాటు నిరీక్షించిన ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు వాపోయారు. రేపు ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతామని, కార్యచరణను రూపొందిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రకటించారు. 11వ పీఆర్సీపై రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు.
ఢిల్లీలోని టీటీడీ దేవాలయం “స్థానిక సలహా మండలి” చైర్ పర్సన్గా వేద మంత్రాల ఆశీర్వచనంతో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి బాధ్యతలు స్వీకరించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలో గోపూజ ప్రశాంతి రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయాల విస్తరణ, సేవల విస్తరణ కోసం ఢిల్లీ “లోకల్ అడ్వైజరీ కమిటీ” పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఉత్తరాదిన ఢిల్లీ,…
కూంబింగ్ నిర్వహించే పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన బూబి ట్రాప్లు బయటపడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మల్లంపేట అటవీ ప్రాంతంలో బూబి ట్రాప్ లు మావోయిస్టులు అమర్చారు. కూబింగ్ చేసే పోలీస్ బలగాలు లక్ష్యంగా ఏడు చోట్ల పదునైన వెదురు కర్రలతో బూబి ట్రాప్లను మావోలు ఏర్పాటు చేశారు. కానీ… చింతూరు డివిజన్ పోలీసులు ఎంతో చాకచక్యంగా బూబి ట్రాప్ లను గుర్తించి ధ్వంసం చేశారు. కాలిబాటల్లో గోతులు తవ్వి పదునైన వెదురు కర్రలతో…